నీనా గుప్తా.. ఈ పేరు తెలుగు వారికి తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు ఆమె చాలా సుపరిచితం. 1982 నుంచి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్న ఈ సీనియర్ తార బుల్లితెర రంగంలోనూ తనదైన ముద్ర వేసుకుంది. లేటు వయసులోనూ ఈ యాక్ట్రెస్ సంవత్సరానికి మూడు సినిమాల వరకు చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది.
2023, జూన్ 29న రిలీజ్ అయిన లస్ట్ స్టోరీస్ 2లో కూడా నీనా గుప్తా యాక్ట్ చేసింది. ఇందులో మృణాల్ ఠాకూర్ తల్లి పాత్రలో ఈమె మెరిసింది. ఇంటెన్స్ రొమాన్స్ సీన్లతో ఈ మూవీ రూపొందింది. ఇందులోని లిప్ కిస్ సన్నివేశాలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్ల భాగంగా ప్రతి స్టార్ తమ వంతుగా కృషి చేస్తున్నారు.
నీనా గుప్తా కూడా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. లస్ట్ స్టోరీస్ 2 గురించి ఆమె మాట్లాడుతూ తన ఫస్ట్ లిప్ కిస్ గురించి సన్సేషనల్ కామెంట్స్ చేసింది. 1990ల ప్రారంభంలో ఆమె దిలీప్ ధావన్తో కలిసి దిల్లగి టీవీ షోలో నటించింది. అయితే స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో మొదటిసారిగా ఆమె ఈ షోలో దిలీప్ ధావన్ను లిప్ కిస్ చేసింది.
దీని గురించి ఆమె మాట్లాడుతూ.. “కొన్నేళ్ల క్రితం యాక్టర్ దిలీప్ ధావన్తో కలిసి ఓ సీరియల్లో నటించాను. ఆ సీరియల్ కోసం కిస్ సీన్ షూట్ చేశారు. ఇండియన్ టీవీ హిస్టరీలో అదే తొలిసారి. అది కూడా నాతో. యాక్టర్ అన్న తర్వాత ఏ సన్నివేశంలోనైనా నటించాలి. అందుకే ఆ రోజు ఆ సీన్ చేయడానికి నేను ఒప్పుకున్నా అని చెప్పింది.
దిలీప్ అందగాడు, నాకు తెలిసివాడు. అయినా అతనితో అలా కిస్ పెట్టుకోవడానికి నేను మెంటల్గా, ఫిజికల్గా సిద్ధంగా లేను. అందుకే ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. అయినా ఆ సీన్ చేసేటప్పుడు నన్ను నేను సమర్థించుకుని చేసేసాను. తర్వాత సౌకర్యంగా అనిపించడంతో వెంటనే వెళ్లి డెటాల్ తో పెదవులు కడుక్కున్నాను. పెద్దగా పరిచయం లేని దిలీప్ని అయిష్టంగానే ముద్దు పెట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది.” అని ఆమె చెప్పుకొచ్చింది. కాగా ఈ కామెంట్స్పై ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతుంది.