త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమా దేవరను స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా రష్మిక మందన్నా లేదా మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. త్రిబుల్ ఆర్తో ఎన్టీఆర్కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది.
ఈ క్రమంలోనే ఇప్పుడు కొరటాల తాను తెరకెక్కించే సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్లోనే ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇదే సమయంలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కూడా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కన్ఫర్మ్ అయిందంటూ వార్తలు వైరల్ రావడంతో ఈ సినిమా యూనిట్ అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది. ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
ఎన్టీఆర్ సినిమా కోసం మాట సాయం చేయనున్నాడట సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఇప్పటికే గతంలో కూడా మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాకు కూడా మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఎన్టీఆర్ కోసం మహేష్ మాట సాయం చేయబోతున్నాడట.
ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి మహేష్ కూడా అంగీకరించారట. మహేష్కు కొరటాల శ్రీమంతుడు, భరత్ అనేనేను రూపంలో రెండు సూపర్ హిట్లు ఇచ్చాడు. ఈ క్రమంలోనే కొరటాల ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగిన వెంటనే మహేష్ ఓకే చెప్పేశాడట.
ఇది నిజమైతే మాత్రం అభిమానులకు మరో పూనకాలు తెప్పించే వార్తనే చెప్పాలి. ఇక ఇప్పుడు దేవర సినిమా హిట్ అవ్వడానికి కొరటాల తన శక్తికి మించి ప్రయత్నాలు చేస్తూ స్ట్రాటజీలు వేస్తున్నాడు. ఇవన్నీ ఎన్టీఆర్కు తిరుగులేని పాన్ ఇండియా విజయం అందిస్తాయో లేదో చూడాలి.