మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులకు ఈనెల 20న ఓ పడంటి ఆడబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబంలో బుల్లి వారసురాలు రావడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానుల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. గత పది సంవత్సరాలుగా మెగా కుటుంబంలో వారసుడు కోసం ఎదురు చేస్తున్న వేళ బుల్లి మహాలక్ష్మి పుట్టడంతో సంబరాలు చేసుకున్నారు.
ఇదే సమయంలో మెగా కోడలు ఉపాసనకు డెలివరీ అయిన సమయంలో ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉపాసనకు పాప పుడుతుందా ? లేదా మెగా ఫ్యామిలీలో వారసుడు పుడతాడా ? అంటూ పెద్ద చర్చే జరిగింది. అలాగే ఉపాసన డెలివరీ అపోలో ఆసుపత్రిలో జరిగింది. ఆమె తాతగారే ఈ హాస్పిటల్కు చైర్ పర్సన్ అన్న విషయం తెలిసిందే.
దీంతో మెగా కోడలు ఉపాసన డెలివరీకి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఉపాసన డెలివరీ కోసం చాలానే డబ్బులు ఖర్చు చేసిందట మెగా కుటుంబం. ఆమె హాస్పటల్లో ఎడ్మిట్ అయిన దగ్గర నుంచి మళ్లీ తిరిగి అత్తవారింట్లో అడుగు పెట్టే వరకు పూర్తి బాధ్యత మెగా కుటుంబం తీసుకుందట. ఉపాసన డెలివరీ కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు పెట్టిందట మెగా ఫ్యామిలీ.
ఇండియాలోని టాప్ మోస్ట్ గైనకాలజిస్టులతో పాటు ఢిల్లీ నుంచి కూడా ఫేమస్ పిడ్రియాటిక్ స్పెషలిస్టులను ఈ ఆపరేషన్ రోజు ప్రత్యేకంగా తీసుకువచ్చారు. అలాగే ఈ డెలివరీ కోసం హాస్పటల్లో ఏకంగా ఒక ఫ్లోర్నే రెంట్కు కొనేశారట. అలా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మెగా కోడలకు దగ్గరుండి డెలివరీ చేయించారు. ఇక ఈ డెలివరీ కోసం అయిన రు. 3 కోట్ల మొత్తాన్ని రామ్చరణ్ స్వయంగా చెల్లించాడట.