నందమూరి బాలకృష్ణ నిజ జీవితంలో ఎంతో కోపంగా ఉంటారని చాలా మంది అనుకుంటారు. అయితే బాలయ్య కోపం అంతా క్రమశిక్షణతో ఉండాలన్నదే. ఆయన తన చుట్టూ ఉన్న వాళ్లు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతోనే కాస్త స్ట్రిక్ట్ ఉంటారే తప్పా ఆయన అకారణంగా ఎవ్వరిని కోపగించుకోవాలని.. ఎవ్వరిని తిట్టాలన్న ఉద్దేశంతో అయితే ఉండరు. అయితే కొందరు మాత్రం తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు.
అయితే నిజ జీవితంలో బాలయ్యతో పరిచయం ఉన్నోళ్లు.. బాలయ్యను దగ్గర నుంచి చూసిన వాళ్లు మాత్రం ఆయన మనసు వెన్న అని.. ఆయన ఎంతో మంచోడనే అంటారు. అయితే ఆహాలో వచ్చిన అన్స్టాపబుల్ షో మాత్రం బాలయ్య మనస్సు ఎలాంటిదో ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చెప్పింది. ఈ క్రమంలోనే బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే వైసీపీకి సానుభూతిపరుడు, ఏపీ సీఎం జగన్కు దగ్గర మనిషి అయిన ప్రియదర్శిని రామ్ బాలయ్య మంచి తనం మరోసారి తేటతెల్లం చేశారు.
బాలయ్య బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది పేద, నిరుపేద వర్గాలకు అత్యున్నత కార్పొరేట్ రేంజ్ వైద్యం అందించడంతో పాటు ఎంతోమంది క్యాన్సర్ బాధితులకు ప్రాణం పోస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియదర్శిని రామ్ కూడా తాను ఆయన పార్టీకి, ఆయన రూట్కు వ్యతిరేకంగా ఉండే వ్యక్తిని అయినా కూడా ఎంతో గొప్ప సాయం చేశారని.. బాలయ్యకు పార్టీలు, వర్గాలతో సంబంధం ఉండదని.. ఎవరికి అయినా సాయం చేస్తారని ఆయన మెచ్చుకున్నాడు.
ఓ పేద పూజారి బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో రాయితీ ఇప్పించాలని నా దగ్గరకు వచ్చాడని.. ఆ టైంలో తాను సాక్షిలో లేనని.. నాకు సాయం చేయగలిగినంత చేస్తానని చెప్పానని రామ్ తెలిపాడు. ఆ పేద పూజారి సమస్య గురించి బాలయ్యకు మెసేజ్ చేశానని.. అయితే సాయంత్రం 7 గంటలకే ఆయన నాకు కాల్ చేసి.. సోదరా ఈ ఆసుపత్రి మీది.. ఇక్కడ రాయితీలు కావాలని మీరు నన్ను అడగడం ఏంటి ? ఇచ్చేయండి అని చెప్పారని రామ్ గుర్తు చేసుకున్నాడు.
బాలయ్య కులం, మతం, పార్టీలు పట్టించుకునే మనిషి కాదని.. అతడు ఎప్పుడూ పేద కుటుంబాలకు సహాయం చేయాలని అనుకుంటాడని.. అదే అతడి గొప్ప వ్యక్తిత్వం అంటూ రామ్ బాలయ్య గురించి చాలా గొప్పగా చెప్పాడు.