ప‌వ‌న్‌తో కొడుకు అకీరా కూడా దూరంగా ఉంటున్నాడా.. ఇద్ద‌రి నిజంగానే పెద్ద గొడ‌వ జ‌రిగిందా ?

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక పక్క సినిమాలు.. మరో పక్క రాజకీయాలు అంటూ క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వ‌చ్చే నెల‌లో బ్రో రిలీజ్ అవుతోంది. ఈ యేడాది చివ‌ర్లో ఓజీ వ‌స్తోంది. ఆ త‌ర్వాత ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలు కూడా ఉన్నాయి.

అటు సినిమాల‌తో పాటు ఇటు రాజ‌కీయాల్లోనూ బిజీబిజీగా ఉన్నాడు. మ‌రోవైపు వారాహి యాత్ర జ‌రుగుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం, ప్ర‌జ‌ల కోసం, త‌న అభిమానుల కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాడు. అలాగే త‌న కుటుంబానికి, అన్న‌ద‌మ్ముల‌కు కూడా ప‌వ‌న్ ఎంతో విలువ ఇస్తాడు. ప‌వ‌న్ కెరీర్ ఆర్థిక సంబంధాల‌కు అంత విలువ ఉండ‌దు.

అందుకే ఆరెంజ్ సినిమా టైంలో త‌న ఆస్తులు అమ్మీ అన్న నాగ‌బాబు అప్పులు తీర్చాడ‌ని.. ఆ కార‌ణంతోనే రేణు ప‌వ‌న్‌కు దూర‌మైంద‌ని కూడా అంటారు. ప‌వ‌న్‌కు విడాకులు ఇచ్చేశాక రేణు త‌న కొడుకు అకీరా, కూతురుతో క‌లిసి పూణేలోనే ఉంటోంది. ఇదిలా ఉంటే ప‌వ‌న్‌కు త‌న కొడుకు ( రేణు బిడ్డ‌) అకీరాకు కూడా గ్యాప్ వ‌చ్చేసింద‌ని.. గ‌త యేడాది కాలంగా అకీరా.. ప‌వ‌న్‌ను క‌లిసేందుకు కూడా పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని.. అందుకే ఇటీవ‌ల కాలంలో వీరిద్ద‌రు క‌లిసిన ఫొటోలు, సంద‌ర్భాలు కూడా లేవ‌నే అంటున్నారు.

ప‌వ‌న్ పార్టీ కార్య‌క‌లాపాల కోసం అకీరా పేరున పెట్టిన ఆస్తుల‌ను కూడా తిరిగి వాడుకున్నాడ‌ని.. ఇదే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మైంద‌న్న పుకార్లు ఇండ‌స్ట్రీలో ఉన్నాయి. రాజ‌కీయం చేయాలంటే చాలా డ‌బ్బులు కావాలి. ఈ క్ర‌మంలోనే రేణుతో పాటు వాళ్ల పిల్ల‌ల పేర్ల రాసిన ఆస్తుల‌ను కూడా వాడేయ‌డం అకీరాకు ఎంత మాత్రం న‌చ్చ‌లేదంటున్నారు.

రేణుకు విడాకుల త‌ర్వాత ప‌వ‌న్ చాలా భ‌ర‌ణం ఇచ్చాడ‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే రేణు మాత్రం తాను ఏం తీసుకోలేద‌ని కూడా చెప్పింది. అయితే ఇప్పుడు రేణుకు, అకీరాకు రాసిన ఆస్తుల‌ను కూడా వాడుకోవ‌డం న‌చ్చ‌కే అకీరా ప‌వ‌న్‌కు దూర‌మైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో వాస్త‌వ‌, అవాస్త‌వాలు ఏంటో చూడాలి.