రాజమౌళి ఫస్ట్ యాడ్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా.. నోరెళ్లబెట్టాల్సిందే…

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడంటే ఆ సినిమాపై అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్ప‌క్క‌ర్లేదు. దాంతో పాటు రాజమౌళిని అభిమానించే వారి సంఖ్య పాన్ ఇండియా రేంజ్‌లో రోజురోజుకు పెరుగుతుంది.

గ‌తేడాది త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన రాజమౌళి ప్ర‌స్తుతం మహేష్ బాబు కాంబినేషన్‌లో భారీ బ‌డ్జెట్‌తో ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో తెర‌కెక్కే సినిమా రూ. 1000 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా 2026 సంవత్సరంలో థియేటర్స్‌లోకి రానుంది.

రాజమౌళి – మహేష్ కాంబో తర్వాత మరోసారి రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా వ‌స్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తన సినిమాలకు దర్శకత్వం వహించడానికి రూ. 100 నుంచి రూ. 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం రాజమౌళి ఒప్పో సెల్‌ఫోన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఒక యాడ్లో నటించాడు.

ఈ యాడ్ కోసం రాజమౌళి 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఒప్పో కి బ్రాండ్ అంబాసిడర్‌గా రాజ‌మౌళి డ్యూయల్ రోల్ ప్లే చేశారు. వైట్ సూట్ లో అట్రాక్టివ్ లుక్ లో అందరిని ఆకర్షించే విధంగా ఈ యాడ్ రూపొందించారు. ఈ యాడ్ ద్వారా అవకాశం దక్కించుకున్న రాజమౌళి ఫ్యూచర్లో మరిన్ని ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.