సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప హీరోయిన్లలో సౌందర్య ఒకరు. మహానటి సౌందర్య తర్వాత అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సౌందర్యకు మాత్రమే వచ్చాయంటే అతిశయోక్తి కాదు. తనదైన అందం ఆకర్షణ మాత్రమే కాదు.. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆమె అసాధారణ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు.
అసలు 15 ఏళ్ల పాటు ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీని మాత్రమే కాదు.. సౌత్ సినిమాను ఏలేశారు. దురదృష్టవశాత్తు తన మేనబావను పెళ్లి చేసుకున్న సౌందర్య యేడాదికే హెలీకాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందారు. బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు ఎన్నికల ప్రచారానికి బెంగళూరు నుంచి కరీంనగర్ వస్తుండగా 17 ఏప్రిల్ 2004న విమాన ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కూడా మరణించారు.
27 ఏళ్ల పిన్న వయస్సులో ఎంతో భవిష్యత్తు ఉండి కూడా ఆమె మృతిచెందారు. ఆమె మరణించి ఇన్నేళ్లు అవుతున్నా.. ఈ తరం జనరేషన్లో కూడా ఆమెకు లక్షల్లోనే అభిమానులు ఉన్నారు. అది సౌందర్య గొప్పతనం. ఇక సౌందర్య మృతిచెందిన రోజే తన మేనకోడలుతో ఏం చెప్పిందనే విషయం ఇన్నేళ్లకు బయటకు వచ్చింది.
సౌందర్య విమాన ప్రమదానికి ముందు తన మేనకోడలిని రెండు కోరికలు కోరారట. కాటన్ చీరలు, కుంకుమ కొనాలని సూచించిందట. అప్పటికి సౌందర్య దగ్గర కాటన్ చీరలు లేనేలేవు అట. అందుకే తన కోడలు నిర్మలను ఓ చీర కొనాలని చెప్పిందట. ఇక తన కోడలు కూడా బీజేపీలో చేరడంతో ఎన్నికల ప్రచారంలో కాటన్ చీరలు ధరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించిందట.
ఈ విషయం నిర్మలకు చెప్పి ఆమె ఫ్లైట్కి వెళ్లిపోయిందట. అలా వెళ్లిన కొద్ది సేపటికే హెలీకాఫ్టర్ కూలిపోవడం.. సౌందర్య చనిపోయిందన్న వార్తలతో వాళ్లువెంటనే తీవ్ర విషాదంలో మునిగిపోయారు.