సీనియ‌ర్ హీరోయిన్ జయసుధ కూతురు కూడా హీరోయినే… ఆమె ఎవ‌రో తెలుసా…!

చిత్ర పరిశ్రమలో ఓ హీరోయిన్ సక్సెస్ అయితే.. ఆమె పేరుతో అక్క లేదా చెల్లెలు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతూ ఉండటం సర్వసాధారణం.. ఇది ఎప్పటినుంచో వస్తున్న పద్ధతి అని చెప్పాలి.. అలా వచ్చిన వారిలో రాధా- అంబిక, ఆర్తి అగర్వాల్- అదితి అగర్వాల్, కాజల్ అగర్వాల్- నిషా అగర్వాల్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది.

ఇప్పుడు ఈ లిస్ట్‌లోకే చెందినవారు జయసుధ, సుభాషిని కూడా.. అయితే వీరిద్దరీలో ఒక‌రు హీరోయిన్‌గా రాణించలేదు. సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధకు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎప్ప‌ట‌కీ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంటుంది. ఆమె ఓ గొప్ప న‌టి. ఆమె స‌హ‌జ‌న‌టి అనే బిరుదు కూడా సొంతం చేసుకున్నారు. ఆమె వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకునే ఆమె చెల్లి సుభాషిని కూడా గ్లామ‌ర్ ఫీల్డ్ లోకి వ‌చ్చారు. అయితే వీరిలో ఒకరు స్టార్ హీరోయిన్ అయితే మరొకరు డిజాస్టర్‌గా మిగిలిపోయారు.

చిత్ర పరిశ్రమలో జయసుధ ఎంతో సక్సెస్ అయితే సుభాషిని మాత్రం సక్సెస్ కాలేకపోయారు. బుల్లితెరపై నాగాస్త్రం, సుందరకాండ వంటి పలు సీరియల్స్ లో నటించింది. కానీ అవి కూడా ఈమెకు మంచి పేరు తీసుకురాలేదు. సీతయ్య, అరుంధతి వంటి సినిమాల్లో నటించిన అవి ఈమెకు అవకాశాలు తెచ్చి పెట్టలేకపోయాయి. ఇక సుభాషిణి కూతురు కూడా సినిమాల్లో నటించింది అనే విషయం చాలామందికి తెలియదు. ఆమె పేరు పూజా ప్రియాంక.

దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన 143 సినిమాలో పూజ ప్రియాంక సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఈమె హీరోను వన్ సైడ్ గా ప్రేమిస్తూ కనిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ఆశించినంతగా సక్సెస్ కాలేదు. దీంతో ఈమె కూడా మళ్లీ చిత్ర పరిశ్రమలో కనిపించలేదు. 2012లో పూజా ప్రియాంకకు, ఆకెళ్ల చంద్ర శేఖర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఈమె తన ఫ్యామిలీ లైఫ్ లో ఎంతో హ్యాపీగా గడుపుతుంది.