సన్యాసిగా మారిపోయిన ప్రభాస్ ఐటమ్ గర్ల్… ఇంత మార్పుకు అదే కార‌ణ‌మా…!

టాలీవుడ్ ఐటమ్ బాంబుగా పేరు తెచ్చుకున్న హంసానందిని ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. పూణేకి చెందిన హంసానందిని 2004 లో వచ్చిన ‘ఒక్కటవుదాం’ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో అధినేత, ప్రవరాఖ్యుడు, అహనా పెళ్ళంట, ఈగ వంటి సినిమాల్లో నటించింది. ఇక ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాలో తొలిసారిగా ఐటెం సాంగ్ లో మెరిసింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో హంసానందిని కూడా మంచి పేరు వచ్చింది.

ఇక తర్వాత బాయ్, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య, లెజెండ్ వంటి పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో ఆడి పాడింది. అంతేకాకుండా జై లవకుశ సినిమాలో బ్యాంక్ ఎంప్లాయ్ గా నటించి మెప్పించింది. ఇక హంసానందిని వెండితెరపై చివరగా నటించిన సినిమా పంతం. ఈ సినిమా తర్వాత ఈమె వెండితెరపై కనిపించలేదు.

తర్వాత ఈమె క్యాన్సర్ వ్యాధికి గురవడంతో.. సుదీర్ఘకాలం క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. ఈ చికిత్సలో భాగంగా హంసానందిని పలుమార్లు కీమోథెరపీ కూడా తీసుకున్నారు. ఆ సమయంలో బోడి గుండుతో చూస్తే ఎవరో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఆమె ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఈ సమయంలోనే ఆమె సోషల్ మీడియా వేదికగా తన మానసిక వేదన స్థితిని తెలియజేస్తూ.. క్యాన్సర్ తో పోరాడి గెలిచిన ఇతర క్యాన్సర్ రోగులకు ధైర్యాన్ని ఇచ్చారు.

ఇక హంసానందిని తాజా ఫోటోలు చూసి నెటిజన్లు కూడా ఒకసారిగా షాక్ అయ్యారు. ఇక ఆ ఫోటోలలో ఆమె సన్యాసిగా మారిపోయారు. ట్రెండీ బట్టల్లో హాట్ గా కనిపించే హంసానందిని ఇప్పుడు కాస్త నిండు అయినా వస్త్రాల్లో ఎంతో పద్ధతిగా ప్రశాంతంగా కనిపించారు. ఓ ఆశ్రమంలో సేదతీరుతున్నట్లు కనిపించింది. క్యాన్స‌ర్ త‌ర్వాత ఆమె ప్ర‌శాంత వాతావ‌ర‌ణం కోరుకుంటున్న‌ట్టే ఉంది. అందుకే ఇలా ఆశ్ర‌మంలో సేద తీరుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

అంతేకాకుండా ఇప్పుడు ఈమె సినిమాలు మానేసారనే వార్త కూడా వైరల్ గా మారింది. దీంతో హంసానందిని నిర్ణయం ఆమె అభిమానులను నిరాశపరిచింది. ఇకపై సన్యాసిగా ప్రశాంత జీవితం గడపాలని ఆమె డిసైడ్ అయినట్లున్నారు.