టాలీవుడ్ ముదురు ముద్దుగుమ్మ అనుష్కకు 40 ఏళ్లు వచ్చినా ఆమె సినిమాలకు ఇప్పటకీ ఎంతో మంది ప్రేక్షకులు ఉన్నారు. ఏమాటకు ఆమాట అనుష్క తెలుగులో ఎందరో స్టార్ హీరోలతో ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్లు కొట్టింది. అనుష్కను మన తెలుగు సినీ జనాలు పిచ్చపిచ్చగా ఆరాధించారు. నిజం చెప్పాలంటే నయనతార మన తెలుగు సినీ జనాలకు కనెక్ట్ అయ్యినదానికంటే అనుష్కే ఎక్కువ కనెక్ట్ అయ్యింది.
ఎందరో స్టార్ హీరోలు కూడా అనుష్కతో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు. బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత అనుష్క ఫేస్లో గ్లామర్ తగ్గింది. ఆ ఛరిష్మా మిస్ అయ్యింది. సైజ్ జీరో సినిమా కోసం ఆమె చేసిన వర్కవుట్లు కలిసి రాలేదు. ఆ తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా ఢమాల్ అయిపోయింది. కరోనా టైంలో ఆమె చేసిన భాగ్మతి మాత్రమే రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.
అయితే ఇప్పుడు కాస్త లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తోన్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. తనకంటే వయస్సులో చాలా చిన్నోడు అయిన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి జంటగా అనుష్క నటిస్తోంది. మహేష్ బాబు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నుంచి విడుదల అయిన స్టిల్స్ అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమా శాటిలైట్ రైట్స్ పై క్లారిటీ వచ్చింది. గట్టి పోటీ మధ్య ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. చాలా ఎక్కువ రేటు కోట్ చేసి మరీ ఈ సినిమా రైట్స్ సదరు ఛానెల్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. రదన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అనుష్కను ఎప్పుడెప్పుడు చూస్తామా ? అని ప్రేక్షకులు ఆసక్తితో ఉన్నారు.