త‌న వీరాభిమాని మృతిపై తార‌క్ ఎమోష‌న‌ల్ మెసేజ్‌..

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తారక్ కి ఉన్న కోట్లాది మంది అభిమానులు ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. తార‌క్‌కు కూడా త‌న అభిమానులు అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ త‌న సినిమాల ఫంక్ష‌న్ల‌కు వ‌చ్చే అభిమానులు చాలా జాగ్ర‌త్త‌గా ఇంటికి వెళ్లాల‌ని ఎన్నో జాగ్ర‌త్త‌లు చెపుతూ ఉంటాడు.

ముఖ్యంగా రోడ్డు ప్ర‌మాదాల్లోనే త‌న ఇంట్లో తండ్రి, అన్న‌ను కోల్పోవ‌డంతో త‌న‌ప్ర‌తి సినిమా ప్రారంభానికి ముందు అభిమానులు, ప్ర‌జ‌లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను చెపుతూ ఉంటాడు. ఇక తార‌క్‌కు ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో శ్యామ్ అనే వీరాభిమాని ఒక‌రు. రీసెంట్ గా శ్యామ్ అనుమానాస్పదంగా మరణించిన వార్త ఇప్పుడు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది.

కేవ‌లం ఎన్టీఆర్ అభిమానులు మాత్ర‌మే కాదు… ఇత‌ర హీరోల అభిమానుల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రు శ్యామ్ మ‌ర‌ణానికి న్యాయం జ‌ర‌గాల‌ని కోరుతున్నారు. రాజ‌కీయ నాయ‌కులు కూడా దీనిపై స్పందిస్తున్నారు.
ఈ విషాద ఘటన ఎన్టీఆర్ వరకు వెళ్లడంతో తారక్ కూడా త‌న అభిమాని మ‌ర‌ణంపై తన స్పందన తెలియజేశాడు. ఓ ఎమోష‌న‌ల్ ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ చేశాడు.

శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన… శ్యామ్ తల్లిదండ్రులకి నా ప్రఘాడ సానుభూతిని తెలియజేస్తున్నా.. అస‌లు శ్యామ్ ఎలాంటి పరిస్థితుల్లో ? ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం అనేది నా మనసును కలచివేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నా అంటూ తార‌క్ ఓ ఎమోష‌న‌ల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.

ఇక శ్యామ్ శ‌రీరంపై ఉన్న గాయాలు, ముక్క‌లోనుంచి ర‌క్తం కార‌డం ఇవ‌న్నీ చూస్తుంటే చంపేసి ఆత్మ‌హ‌త్య‌గా క్రియేట్ చేశార‌న్న అనుమానాలు కూడా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.