తెలుగు చిత్ర పరిశ్రమల అగ్రదర్శకుడిగా పేరుపొందిన రాజమౌళి తన కేరీర్లో ఇప్పటివరకు ఒక ప్లాఫ్ సినిమా లేదనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత కూడా ఈయనదే. బాహుబలి సినిమాలతో దేశవ్యాప్తంగా తన దర్శకత్వంతో సత్తా చాటన రాజమౌళి.. ఆ తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర దర్శకులతోనే శభాష్ అనిపించుకున్నాడు. అంతేకాకుండా ఎప్పటి నుంచో కలలు కంటున్న ఆస్కార్ అవార్డును కూడా ఇండియాకు అందించాడు.
అలాంటి ఈ అగ్ర దర్శకుడుతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎందరో నటీనటులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రాజమౌళి గతంలో ఒకానొక సమయంలో మనకు సినిమాలు అవసరమా అని అనుకున్నారట. ఇక ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సినిమాలు కాకుండా ఏదైనా ఉద్యోగం చేస్తే మంచిది కదా అన్నట్టుగా రాజామౌళి భావించారట. 1991లో తనకు డైరెక్టర్ కావాలని కోరిక ఉండేదట.
అయితే ఆ సమయంలో డైరెక్టర్గా తాను సక్సెస్ అవుతానని ఎంతో కాన్ఫిడెంట్గా ఉండేవాడట. అదే సమయంలో మధ్యలో ఒక సంవత్సరం పాటు అసలు సినిమాలు తీయడం అవసరమా ? అని కూడా ఆలోచించారట. ఆలోచనతో తనకున్న కాన్ఫిడెంట్ మొత్తం పూర్తిగా పోయిందట. చిత్ర పరిశ్రమలో అడుగుపెడితే కచ్చితంగా సక్సెస్ అవుతానని నమ్మకం ఉండేది కాదని.. దీనికి బదులుగా ఏదైనా ఉద్యోగం చేయటమే ఎంతో బెటర్ అని భావించారట.
తన భార్య రమా తనకు ఎంతో ధైర్యం ఇచ్చిందని ఆమె ఇచ్చిన ధైర్యంతోనే మళ్ళీ ఇంకెప్పుడు తనకు ఆలోచన రాకుండా చిత్రపరిశ్రమలో అడుగుబెట్టి ఈ స్థాయికి వచ్చారని రాజమౌళి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తనకు ఆ ఆలోచన రావడానికి ఆ సమయంలోనే నేను కొత్తగా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలో అడుగుపెట్టాను.. ఆ సమయంలో ఎలాంటి సంపాదన లేకుండా ఖాళీగా ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయని రాజమౌళి చెప్పుకొచ్చాడు.
ఇక తర్వాత తన భార్య రమా సహకారంతో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన ఎదుర్కొంటూ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఇప్పుడు ప్రపంచ దిగ్గజ దర్శకులలో ఒకరిగా రాజమౌళి పేరు తెచ్చుకున్నాడు. ఇక రమా రాజమౌళి భర్త సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేస్తుందన్నది తెలిసిందే.