‘ విక్రమార్కుడు ‘ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ అయిన ఇద్ద‌రు టాలీవుడ్ స్టార్ హీరోలు…!

మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఏకైక బ్లాక్ బస్టర్ సినిమా విక్రమార్కుడు. 2006 జూన్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి నిన్న‌టితో 16 ఏళ్ళు పూర్తి కావస్తోంది. తొలి షో తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటికీ రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్న పాత్రలో నటించాడు.

అత్తిలి సత్తిబాబుగా, విక్రమ్ సింగ్ రాథోడ్ గా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాలో రవితేజకు జంటగా స్వీటీ బ్యూటీ అనుష్క నటించింది. అలాగే ఈ సినిమాలో విల‌న్‌గా న‌టించిన అజ‌య్‌ పాత్ర కూడా సినిమాకి జీవం పోసింద‌ని చెప్ప‌లి. ఇలాంటి బ్లాక్ బాస్టర్ సినిమాను వదులుకున్న స్టార్ హీరోలు కొందరు ఉన్నారు. రాజమౌళి ఈ సినిమాను ముందుగా బాలకృష్ణ కోసం అనుకున్నాడట.

అయితే రాజ‌మౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ క‌థ‌ రాసాడట. వాళ్లిద్దరూ కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించకపోవడంతో. రాజమౌళి ఈ సినిమాను రవితేజతో తెర‌కెక్కించాడు. అలాగే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం అజయ్ కంటే ముందే ఓ బాలీవుడ్ స్టార్ హీరోని అనుకున్నాడట. ఆ హీరో మరెవరో కాదు వివేక్ ఒబెరాయ్ అని అప్పట్లో టాక్ కూడా నడిచింది.

ఆ స‌మ‌యంలో రాజమౌళి పై బాలీవుడ్ కి అంత‌ నమ్మకం లేదు. కాబట్టి.. వారు ఎవ‌రు ఈ సినిమాలో న‌టించ‌డానికి స‌హ‌సం చేయ్య‌లేక పోయ్యారు. ఈ క్రమంలో అజయ్ ను ఫైనల్ చేసి.. ఆ పాత్రకి పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించారు రాజమౌళి. ఇలా ‘విక్రమార్కుడు’ ని ఇంత మంది స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారు. అలా చివ‌ర‌కు ర‌వితేజ ఖాతాలో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ప‌డింది. ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ మ‌రో ప‌దేళ్లు వెన‌క్కు తిరిగి చూసుకోలేదు.