మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులకు ఈ నెల 20న ఓ పండంటి పాప పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ గత పది సంవత్సరాలుగా మెగా వారసుల కోసం ఎదురుచూస్తున్న వేళ చరణ్ కు ఆడపిల్ల పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
గత మూడు రోజులగా హాస్పటల్లో ఉన్న ఉపాసన నిన్న మధ్యాహ్నం హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తన అత్తారింట్లో అడుగు పెట్టింది. గతంలోనే ఉపాసన తనకు డెలివరీ అయిన వెంటనే తన తల్లిదండ్రుల దగ్గరికి కాకుండా తన అత్త మామ చిరంజీవి, సురేఖ దగ్గరే ఉంటానని ఆమె చెప్పుకొచ్చింది. అదే సమయంలో రామ్ చరణ్ కూడా తన కూతురు తన తండ్రి పోలికలో ఉందని చెప్పడంతో మెగా అభిమానులు కూడా ఎంతో సంబరపడిపోయారు.
ఇక రామ్ చరణ్- ఉపాసనకు పెళ్లి జరిగి పది సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు పిల్లలు పుట్టకపోవడంతో మెగా కుటుంబంతో పాటు అభిమానులు కూడా ఎంతో బాధపడ్డారు. ఆ సమయంలో వీరి జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నాయా అని చిరంజీవి గతంలో ఓ జ్యోతిష్యుణ్ణి కలిసినప్పుడు రామ్ చరణ్ తో ప్రతి సోమవారం శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయించండి.. అప్పుడు మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందని చిరంజీవికి చెప్పాడట.
దాంతో చిరంజీవి రామ్ చరణ్తో గత రెండు సంవత్సరాల నుంచి హైదరాబాద్కు దగ్గరలో ఉన్నన దామకొండలోని ఓ ప్రముఖ శివాలయంకు తీసుకువెళ్లి అక్కడ క్రమం తప్పకుండా ఆ శివలింగానికి అభిషేకం చేయించేవాడట. అలా ఆ శివలింగానికి అభిషేకం చేయడం వల్లే రామ్ చరణ్ కు పిల్లలు పుట్టారని తెలుస్తుంది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ అలా అభిషేకం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.