తండ్రి, కొడుకులుగా ప‌వ‌న్ – అమితాబ్‌… బాక్సాఫీస్ షేకింగ్ కాంబినేష‌న్ అంటే ఇది…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటూ వారాహి యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ జిల్లాలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇలా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వరుస సినిమా షూటింగ్లో కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలుకు పైగా ఉన్నాయి. అందులో మూడు సినిమాల షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజీ కూడా ఒకటి.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా డ్యూయల్ రోల్లో నటించబోతున్నాడు. పవన్ ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న సమయంలో ఈ సినిమాలో ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు చిత్ర యూనిట్. వచ్చే ఆగస్టు నెలలో 15 రోజులు పాటు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొని ఈ సినిమా పూర్తి చేస్తారని తెలుస్తుంది.

అంతే కాకుండా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి పోటీగా విలన్ పాత్రలో బాలీవుడ్ న‌టుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉండబోతుందట‌. అలాంటి ఈ పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి బాలీవుడ్ బిగ్‌బి అమితాబచ్చన్‌ను ఎంపిక చేశారని తెలుస్తుంది.

ఇక ఈ సమయంలోనే ఓజీలో పవన్ కళ్యాణ్ కు తండ్రిగా అమితాబ్ నటిస్తార‌న్న వార్త‌ల‌తో ఈ సినిమాపై అంచనాలు మరో స్థాయికి వెళ్ళాయి. ఈ విషయం గురించి సినిమా యూనిట్ కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నార‌ట‌. అంతేకాకుండా ఈ సినిమా ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. మరి దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి.