టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో తన కెరీర్ లోనే ఫస్ట్ టైం డబుల్ హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోలలో వరుసగా ఆరు హిట్ల కొట్టడం అంటే మామూలు విషయం కాదు.. అలాంటి అరుదైన రికార్డ్ ఎన్టీఆర్ కు మాత్రమే దక్కింది. ఇక త్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు.
ఈ పాన్ ఇండియా ఇమేజ్ కంటిన్యూ చేసేందుకు ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్టులకే ఓకే చెప్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర, ఆ వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా.. ఆ తర్వాత వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న సినిమాలే కావటం విశేషం.
ఇక దేవర సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పటి నుంచే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను కొరటాల శివ కూడా పాన్ ఇండియా లెవల్లో హిట్ చేసేందుకు కసితో వర్క్ చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ హీరోయిన్లు జాన్వీకపూర్, దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి.
పాన్ ఇండియా లెవల్లో రు. 500 కోట్లు కలెక్షన్లు టార్గెట్గా ఈ సినిమాను కొరటాల తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కు సినిమా ఆద్యంతం పూనకాలు తెప్పించే రేంజ్లో ఈ సినిమాలో సీన్లు ఉండబోతున్నాయట. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్తో పాటు సెకండాఫ్లో వచ్చే యాక్షన్ సీన్లు చూస్తుంటే గూస్ బంప్స్ మోత మోగిపోవడం ఖాయం అంటున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్లో రు. 500 కోట్లు కొల్లగొట్టాడు అంటే అది ఖచ్చితంగా సెన్షేషనల్ అవుతుంది.. ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది.