ఆ ఒక్క బ్లాక్‌బ‌స్ట‌ర్ పాట కోసం ఎన్టీఆర్ ఇంత పంతం వేశారా… ర‌చ‌యిత‌ మైండ్ బ్లాక్‌..!

నటరత్న ఎన్టీఆర్ ఏ సినిమా అయినా తీస్తే దానిలో ప్రతి సన్నివేశాన్ని ఆయన ముందుగా బ్ర‌హ్మాండ‌మైన విజువ‌ల్స్ ఊహించుకున్న‌ తర్వాతే ఆ సన్నివేశాన్ని తెరకెక్కించేవారు. ఆయన ఎలా అనుకున్నారో ? అదే విధంగా ఆ సన్నివేశం వచ్చేదాకా ఎంతో ఇన్వాల్వ్ అవుతూ ప్రతి ఫ్రేమ్‌లోను తన ముద్ర కనిపించేలా చూసుకునేవారు. ఇలా ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్లు అయ్యాయి.

Remembering Sr NTR on his birth anniversary: Chiranjeevi, Jr NTR, Kalyanram  and others pay rich tributes to legendary actor | Telugu Movie News - Times  of India

ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో ఎవరూ చేయని సాహసోపేతమైన సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మరీ ముఖ్యంగా పౌరాణిక సినిమాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అలా ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా సీతారామ కళ్యాణం. ఈ సినిమాలో ఎన్టీఆర్ రావణాసురుడి పాత్రలో నటించారు. అంతేకాకుండా ఎంతో వైవిధ్యంగా రావణాసురుడి జీవితాన్ని చూపించారు. ఇది ఎలా ఉన్నా ?రామాయణంలోని కీలకమైన ఘట్టాలను యధాతధంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

ఇక ఆదే సమయంలో ఎక్కడ రాజీ పడలేదు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ వాహినీ స్టూడియోను సంవత్సరం పాటు అద్దెకి తీసుకుని తెరకెక్కించారు. ఆ రోజుల్లో ఆ స్టూడియోను అన్ని రోజులు అద్దెకి తీసుకొని చిత్రీకరించిన సినిమా కూడా ఇదే. ఇదే సమయంలో ఈ సినిమా ఎలా ఉన్నా ఈ సినిమాలో వచ్చే సీతారాముల కళ్యాణం పాట చివరిలో వస్తుంది.. ఇక ఈ పాటను సముద్రాల సీనియర్ రచించారు.

Seetha Rama Kalyanam (1961) - IMDb

ఇప్పటికీ ఈ పాటను ఏ పెళ్లి జరిగిన, శ్రీరామనవమి పందిళ్లలో సహా ఆలయాల్లో మారుమోగే.. ”శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండీ.” ఈ పాట ఇప్పటికీ అందర్నీ అలరిస్తూనే ఉంది.
ఈ పాటను రాసింది సముద్రాల సీనియర్.. సంగీతం అందించింది ఘంటసాల.. ఇక‌ ఈ పాటను ఆరోజులో ఒక రాత్రిలో ఏమి రాయలేదు పాట రాయడానికి మూడు నెలల సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ సన్నివేశం కోసం ఎలాంటి పాట రాసిన అన్న గారికి నచ్చేది కాదట.

పాట రాసేవారికి ఒకటే చెప్పేవారు మీరు ఏం చేస్తారో తెలియదు ఈ పాట కొన్ని తరాలపాటు నిలిచిపోవాలి అంటూ సముద్రాలకు చెప్పారట.. అన్నగారు చెప్పిన విధంగానే సముద్రాల ఈ పాటను ప్రాణం పట్టి రచించాడు. ఈ పాట ఇప్పటికీ ఎంతో అజరామవరంగా నిలిచిపోయింది. ఈ పాట ఎప్పుడు చూసినా ఎన్టీఆర్ కష్టం ఆయన ఆలోచన ఏంటో అందరికీ అర్థమవుతుంది. అందుకే ఎన్టీఆర్ చిరస్మరణీయుడుగా నిలిచిపోయాడు.