బాహుబలి సినిమాల తర్వాత తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిన సినిమా త్రిబుల్ ఆర్. 100 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డు వచ్చిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచ స్థాయి దర్శకులలో ఒకరుగా నిలిచారు. అలాగే ఈ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ చరణ్- ఎన్టీఆర్లు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ స్నేహానికి, నటనకి ప్రేక్షకులు కూడా ఎంతో ఫిదా అయిపోయారు.
ఈ సినిమాలో ఆ పాత్రలో ఈ ఇద్దరిని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము అన్నట్టుగా తమ నటనతో మెప్పించారు. కానీ ఈ సినిమా స్టోరీ రాసుకున్నప్పుడు ఈ పాత్రల కోసం అనుకున్న హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కాదట.రాజమౌళి తను ఏ హీరోలతో సినిమా చేయాలని కథను రాయించుకుంటారో వారితోనే సినిమా తీస్తారు.
అలా ఆయన అనుకున్న హీరోలతో సినిమా కుదరకపోతే కథను వదిలేస్తారు. ఇదే విషయాన్ని రాజమౌళి ఎన్నోసార్లు కూడా చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో త్రిబుల్ ఆర్ విషయంలో అలాంటిదేమీ జరగలేదు. ఇక ఇదే విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు ఇందులో రజినీకాంత్, యాక్షన్ కింగ్ అర్జున్ ను హీరోలుగా అనుకున్నారట.
ఆ తర్వాత సూర్య కార్తీ అయినా సెట్ అవుతారని భావించారట. కానీ చివరకు నేను అనుకున్నది కాకుండా రామ్ చరణ్- ఎన్టీఆర్ ను నా కొడుకు ఎంచుకున్నాడు. అలా వీరిద్దరి కాంబోలో ఈ సినిమా తెరకెక్కిందంటూ ఈ విషయాన్ని విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది.