బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాని అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఈమే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్లో కియారా అద్వాని హీరోయిన్. అలాగే కియారా అద్వాని ఈ సంవత్సరం మొదటి లోనే తాను ప్రేమించిన బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది.
ఇదే సమయంలో వీరి పెళ్లికూడా ఎంతో విచిత్రంగా జరిగింది. వీరిద్దరూ పెళ్లి వరకు ఎక్కడ జంటగా కనిపించింది కూడా లేదు. అసలు వీరిద్దరూ ప్రేమించుకున్నారనే డౌట్ కూడా ఎవరికి రాలేదు. పెళ్లికి పది రోజులు ముందు కూడా వీరి వివాహ విషయాన్ని బయట పెట్టలేదు. దీంతో వీరి పెళ్లి ప్రకటన వచ్చిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే కియారా అద్వానీ, ముఖేష్ అంబానీ ఇంటికి కోడలుగా వెళ్లాల్సిందట. ఆ పెళ్లి ఎందుకు జరగలేదు ఇప్పుడు చూద్దాం.
కియారా అద్వానీ, తండ్రి జగదీశ్ అద్వానీ, ముఖేష్ అంబానీ కి చాలా మంచి మిత్రుడు. ఈయన కూడా ఓ గొప్ప వ్యాపారవేత్త. అలా చిన్నప్పటి నుంచి కియారా – ధీరుభాయి ఇంటర్నేషనల్ స్కూల్లో ఈషా, ఆకాష్ లతో కలిసి కీయరా అద్వాని చదువుకుంది. వీరందరూ పెరిగే కొద్ది కియారా అద్వానికి ఆకాష్ అంబానికి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమతోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు.
అదే సమయంలో కియారాకి చిన్నప్పటి నుంచి హీరోయిన్ మోడల్ అవ్వాలని ఆశపడేది.. అలా ఈమె అనుకున్న విధంగానే సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ గా మారింది. అదే సమయంలో కియారా సినిమాల్లోకి వెళ్ళటం ఆకాష్ అంబానికి అసలు ఇష్టం లేదు.. కానీ ఆకాష్ అంబానీ ఎంత చెప్పినా వినకుండా కియారా సినిమాల్లోకి వెళ్ళింది. దీంతో కియారా అద్వానీతో ఆకాష్ అంబానీ విడిపోయారు.
ఆ తర్వాత తనపై చదువులు కోసం అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత తను చిన్ననాటి స్నేహితురాలైన శ్లోకా మెహతాని పెళ్లి చేసుకున్నాడు ఆకాష్. ఈ విధంగా సినిమాలపై ఉన్న పిచ్చితో ముఖేష్ అంబానీ ఇంటి కోడలు కావాల్సిన కియారా అద్వాని సిద్ధార్థ్ మల్హోత్రా భార్యగా మిగిలిపోయింది.