బి. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో జయమాలిని, నరసింహరాజు, ప్రభ కీలక పాత్రల్లో నటించారు. ముందుగా ఈ సినిమాను శోభన్బాబు తో చేయాలని దర్శకుడు విఠలాచార్య భావించారు. అయితే.. కథనచ్చినా.. ఎందుకో శోభన్బాబు వద్దన్నారు. దీంతో దర్శకుడు దాసరి నారాయణ రావు. అప్పటికే నరసింహరాజుకు ఆఫర్లు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో ఆయనే స్వయంగా మాట్లాడి నరసింహరాజుకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇప్పించారు.
అయితే.. సినిమా విడుదలైన రోజు నుంచి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా కుమొత్తంగా 5 లక్షల రూపాయలు ఖర్చయితే… దాదాపు కోటి రూపాయలు వసూలు చేసింది. ఇలాంటి అద్భుతమైన సినిమా విడుదలై విజయంవంతంగా సాగుతున్న క్రమంలో ఆఫర్లు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయని టీం అంతా భావించింది. కానీ… అనూహ్యంగా వీరికి ఆరు మాసాల వరకు కూడా ఎలాంటి ఆఫర్లు రాలేదు. మధ్యలో విఠలాచార్యే జోక్యం చేసుకుని మరో సినిమా అనుకున్నారు.
కానీ, అనారోగ్య కారణాలతో ఆయన సినిమా ను తీయలేక పోయారు. దీంతో ఆరు మాసాల వరకు కూడా ఎవరికీ ఎలాంటి ఆఫర్ దక్కలేదు. అప్పట్లో ఇదొక చర్చగా మారింది. నరసింహరాజు అయితే… సొంతగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయం దాసరితో చర్చించారు కూడా. అయితే.. తాను తీయబోయే సినిమాలో హీరో వేషం ఇస్తానని దాసరి చెప్పారు. కానీ, నిర్మాత మాత్రం పట్టుబట్టి.. ఎన్టీఆర్తో సినిమా చేశారు. దీంతో నరసింహరాజుకూడా ఆరు మాసాలు ఖాళీగానే ఉన్నారు.