చిత్ర పరిశ్రమలో అవకాశం రావటం అనేది చాలా అరుదు. కానీ వచ్చిన అవకాశాన్ని కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందని ఎవరో చెప్పలేరు. ఒకప్పుడు సినిమాల్లో ఒక ఛాన్స్ వస్తే చాలు జీవితం మారిపోతుందని అందరూ అనుకుంటారు. ప్రస్తుత కాలంలో మాత్రం ఎన్ని సినిమాల్లో నటించిన స్టార్ ఇమేజ్ రావటం లేదు. ఒకవేళ ఓ మోస్తరు ఇమేజ్ వచ్చిన అది ఎంతో కాలం ఉండటం లేదు. అయినా కూడా ఎంతో కష్టపడి సినిమాల్లో అవకాశం తెచ్చుకున్న ఎంతోమంది హీరోయిన్లు కూడా ఉన్నారు.
అయితే కొంతకాలం పాటు ఎంత కష్టపడినా ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత చిత్రపరిశ్రమకు దూరమైనన వారిలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ పార్వతి మెల్టన్ కూడా వస్తుంది. తన తొలి సినిమాతోనే బెస్ట్ హీరోయిన్ అనిపించుకున్న పార్వతి మెల్టన్. వెన్నెల సినిమాతో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా మారుతుందని అనుకున్నారు కానీ చాలా సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు.
ఇక అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్స సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో తన నటనతో అకట్టుకున్న ఆతర్వాత హీరోయిన్గా చేసిని సినిమాలు ఈమెకు పెద్దగా కలిసిరాలేదు. ఆతర్వాత మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ కనువిందు చేసింది. పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు అంటూ ఆమె సాగే ఈ పాట అప్పట్లో యూట్యూబ్ను షేక్ చేసింది.
బాలకృష్ణతో కలిసి శ్రీమన్నారాయణ, సాయిరాం శంకర్తో కలిసి యమహో యమా అనే సినిమాల్లో నటించింది పార్వతి . వీటి తర్వాత సినిమా ఇండస్డ్రీ నుంచి హఠాత్తుగా మాయమైపోయింది. అవకాశాలు లేకనో ఇతర కారణాల వల్లనో సినిమాల్లో కనిపించడం మానేసిందీ. అయితే పార్వతి మెల్టన్ సినిమాల్లో లేకపోయినా బీచుల్లో.. జలపాతాల వద్ద తెగ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ తన అందచందాలతో ఫొటోలు దిగింది. వాటిని నెట్టింట్లో పెట్టేసరికి యూత్ షాక్ అవుతున్నారు. పార్వతి మెల్టన్ గుర్తుపట్టకుండా ఇలా మారిపోయిందేంటి? అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆమె పోటోలు సోషల్ మీడియలో వైరల్గా మారాయి..!