లావణ్య త్రిపాఠి..మొన్నటి వరకు ఒక హీరోయిన్ మాత్రమే. ఇప్పుడు మెగా కోడలు కూడా. కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో వైరల్ అయిన విషయాల్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ టాపిక్ ఒకటి. తాజాగా వీరిద్దరి ఎంగేజ్ మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. త్వరలోనే వీరిద్దరి పెళ్లి ఇటలీలో జరగనుందని సమాచారం. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా నుంచే ప్రేమలో పడ్డారని, చాలా రోజులు వీరి ప్రేమవ్యవహారం గురించి సోషల్ మీడియాలో, సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు వీరి ప్రేమ బంధాన్ని ధ్రువీకరిస్తూ వీరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.
దీంతో ఇప్పుడు లావణ్య త్రిపాఠి గురించి అందరు తెలుసుకుంటున్నారు. అయితే లావణ్య త్రిపాఠి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొచ్చాయి. అందరి హీరోయిన్ల కన్నా లావణ్య త్రిపాఠి చాల భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయంట. ఆమె తల్లి ఉపాధ్యాయురాలు. తల్లితండ్రుల ప్రభావం లావణ్య త్రిపాఠి పై బాగా ఉండేది.
ఉన్నత విద్యావంతులైన దంపతులకు పుట్టిన లావణ్య సైతం డెహ్రాడూన్, ముంబై వంటి ప్రాంతాల్లో మంచి విద్య సంస్థల్లో చదువును పూర్తి చేసింది. దీంతో లావణ్య అన్ని విషయాల్లో పై చేయి సాధించేది. తాజాగా లోక్ సభ స్పీకర్ మరియు వైశ్య ప్రముఖుడు అయినా ఓం బిర్లా బ్రాహ్మణులను ఉద్దేశించి కొంత ప్రశంసలతో కూడిన వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలను లావణ్య వ్యతిరేకించింది. ఎవరు కూడా ఇక్కడ కులం కారణంగా గొప్ప వారు కాలేరు అని, వారు చేసే పనుల వల్లే వారి గొప్పతనం ఉంటుందంటూ బహిరంగంగా ఓం బిర్లా కు సవాల్ విసిరింది.
లావణ్య చేసిన వ్యాఖ్యలు కూడా నెట్టింట హల్ చల్ చేసాయి. ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహానికి గురయ్యింది. అయితే ఇంత చిన్న తనంలోనే లావణ్యకు కులం పట్ల ఉన్న అవగాహన చూసి అందరు షాక్ అయ్యారు. లావణ్య చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పార్టీ ఫైర్ అయ్యింది. బీజేపీ పార్టీకి ఆమెకు సోషల్ మీడియాలో దాడి మొదలయ్యింది. లావణ్య తన ట్వీట్ ని తొలిగించినా కూడా ఆమె పై మాటల దాడి ఆగలేదు. దీంతోనే అర్థం అవుతుంది లావణ్య ఎంత రెబెలో. వరుణ్ తో పోలిస్తే లావణ్య కొంచెం స్ట్రాంగ్ అనే అనిపిస్తుంది.