మూడు అడుగులు ముందుకు వేస్తే ఆరడుగులు వెనక్కు అన్నట్టుగా కొనసాగుతోంది మహేష్ బాబు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఎందుకో తెలియదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏ మాత్రం ముందుకు సాగటం లేదు. ఎప్పుడు ఏదో ఒక అవంతరం ఎదురవుతూ వస్తోంది. ముందుగా మహేష్ బాబు ఇంట్లో రెండు మూడు సంఘటనలు జరగటం ఆ తర్వాత మహేష్ బాబు విదేశీ పర్యటనలకు వెళ్లి రావటంతో కొద్దిరోజులు ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది.
ఇటు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా కంటే పవన్ కళ్యాణ్ సినిమాలు సెట్ చేయటం పవన్ సినిమాలకు తెరవెనక పనిచేయడంతోనే కాలం గడుపుతూ వస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ను పెట్టుకోవడం మహేష్కు ఏ మాత్రం ఇష్టం లేదు. సర్కారు వారి పాట అవుట్ పుట్ మహేష్ కు అస్సలు నచ్చలేదు. అయినా త్రివిక్రమ్ మహేష్ను ఒప్పించి మరి తమన్ను ఈ ప్రాజెక్టులోకి తీసుకువచ్చాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తమన్ ఇచ్చిన ట్యూన్స్ మహేష్ కు ఏమాత్రం నచ్చలేదని అందుకే ఈ సినిమా నుంచి తమన్ను తప్పించేసారనే ప్రచారం జరిగిన.. తమన్ ఆ ప్రచారంపై తనదైన రీతులు కౌంటర్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.
ఇప్పుడు మరో పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే త్రివిక్రమ్ కు ఎంతో ఇష్టమైన హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ ప్రాజెక్టు నుంచి తెప్పించినట్టు తెలుస్తోంది. కారణం ఏంటన్నది తెలియదు కానీ మహేష్ కు పూజను హీరోయిన్గా కంటిన్యూ చేయటం ఇష్టం లేదు అన్న కొత్త రూమర్ అయితే బయటకు వచ్చింది. ఇప్పటికే తమన్ను కొనసాగించడం కూడా మహేష్ కు అస్సలు ఇష్టం లేదు ఇటు త్రివిక్రమ్ కూడా ఈ ప్రాజెక్టు మీద పెద్దగా వర్క్ చేస్తున్నట్టు లేదు. ఇప్పుడు పూజా హెగ్డే అని కూడా పక్కన పెడతారన్న వార్తలతో మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్టు పై పెద్ద గందరగోళం నెలకొంది. కారణం ఏదైనా కావచ్చు సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంతా వేగంగా ముందుకు లెళ్ళడం లేదని టాలీవుడ్లో గత 7, 8 నెలలుగా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.