టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హఠాన్మరణం సినీవర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణ వార్త తెలుసుకున్న వెంటనే ఎంతోమంది స్టార్ హీరోల అభిమానులు సినీ ప్రముఖులు ఒక మంచి కొరియోగ్రాఫర్ ను టాలీవుడ్ కోల్పోయింది అంటూ సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ తన కెరీర్లో 1500 కు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. ఎంతో మంది స్టార్ హీరోలకు ఆయన అద్భుతమైన స్టెప్పులు కొరియోగ్రఫీ చేశారు.
ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న వారందరూ రాకేష్ మాస్టర్ దగ్గర ఒకప్పుడు శిష్యరికం చేసినవారే అలాంటి రాకేష్ మాస్టర్ గత కొంతకాలంగా జీవిస్తున్న విధానం అందరినీ ఎంతో ఆశ్చర్యపరిచింది. ఏమీ లేని వాడిలా రాకేష్ మాస్టర్ అతి సాధారణ జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఇక సోషల్ మీడియాలో చాలా కాంట్రవర్సీ కామెంట్లతో ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలిచారు. అన్ని సినిమాలకు కొరియోగ్రఫీ చేసి చాలా ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్న ఆయన ఏమి సంపాదించుకోలేద అందుకే చివరి దశలో ఇబ్బందికరమైన జీవితం అనుభవించారా అన్న అనుమాలను చాలామందిలో కలుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే రాకేష్ మాస్టర్ ఆస్తులపై ఇప్పుడు చాలా చర్చ సాగుతోంది, రాకేష్ మాస్టర్ ముందుగా రెండు పెళ్లిళ్లు చేసుకుని భార్యలకు దూరమయ్యారు. చివర్లో మరో మహిళతో ఆయన సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఆయన మరణించడానికి కొద్ది నెలల ముందు ఆమెతో కూడా విభేదాలు రావడంతో దూరమయ్యారు. ఆయన పాపులర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు బాగానే ఆస్తులు కూడా పెట్టారట జూబ్లీహిల్స్ లో పెద్ద బంగ్లా ఉందని దీంతో పాటు హైదరాబాద్ సివర్లలో మూడు ఎకరాల భూమి కూడా ఉందని తెలుస్తోంది.
ఈ మూడు ఎకరాల భూమి విలువ కోట్లలోనే ఉంటుందని తెలుస్తోంది. రాకేష్ మాస్టర్ తన ఇద్దరు భార్యలతో పాటు వారి వారసులకు బాగానే ఆస్తులు సంపాదించి పెట్టారు. వారి జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన మొత్తం ఆస్తులు రూ.50 కోట్లకు పైనే ఉంటాయని తెలుస్తోంది. ఆయన టాలీవుడ్ లో వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష లాంటి స్టార్ హీరో హీరోయిన్లకు డ్యాన్స్ పాఠాలు నేర్పించారు.