మహానటి సావిత్రితో అన్నగారు దాదాపు 50 సినిమాలకు పైగానే చేశారు. ఇద్దరూ కూడా హిట్ పెయిర్ అనే పేరు తెచ్చుకున్నారు. తొలినాళ్లలో భానుమతితో అన్నగారు కలిసి నటించారు. తర్వాత.. కాలంలో సావిత్రి తో వరుసగా సినిమాలు చేశారు. సొంత బ్యానర్పై చేసిన అనేక సినిమాల్లోనూ.. కొన్నింటిలో సావిత్రినే హీరో యిన్గా పెట్టుకున్నారు. రామారావు గారు… అని సావిత్రి, మీరు మహానటి అనిఅన్నగారు సంభోదించుకు నేవారు.
అయితే.. తిరుపతమ్మ కథ సినిమా విషయానికి వచ్చే సరికి అన్నగారు సావిత్రిని వద్దన్నారు. కృష్ణకుమారి ని హీరోయిన్గా తీసుకున్నారు. నిజానికి సావిత్రి అయితే బాగుంటుందని దర్శకుడు, నిర్మాతలు కూడా నచ్చజెప్పారు. కానీ, అన్నగారు మాత్రం వినిపించుకోలేదు. పైగా.. నేను నటించను.. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అని తెగేసి చెప్పారు. దీంతో అన్నగారి ఆదేశాల మేరకు కృష్ణ కుమారిని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. సినిమా హిట్టయింది.
కానీ, కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఇదిలావుంటే.. అసలు సావిత్రిని అన్నగారు ఎందుకు వద్దన్నారనే విష యం ఆసక్తిగా మారింది. దీనిపై తిరుపతమ్మ కథ సినిమా నిర్మాత ఆరా తీశారు. ఈ క్రమంలో అన్నగారి తో సావిత్రికి విభేదాలు వచ్చాయని తేల్చి చెప్పారు. ఒక సినిమా షూటింగుకు.. సావిత్రి బాగా లేటుగా వచ్చారట. ఆ సినిమాలో అన్నగారే హీరో. అయితే.. కారణం చెప్పాలని నిలదీయడంతో సావిత్రి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగి వెళ్లిపోయారట. దీంతో అప్పటి నుంచి అన్నగారు సావిత్రి మొహం చూడలేదని ఇప్పటికీ తెలుగు సినీ రంగంలో ఒక టాక్ ఉంది.