రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమాలో విజయ్కు జంటగా స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. క్లాసికల్ లవ్ స్టోరీ గా వస్తున్నా ఈ సినిమాను సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సమంత- విజయ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కూడా ఇదే. గతంలో మహానటి సినిమాలో విజయ్కు జోడిగా సమంత నటించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డీల్ లాక్ అయిందని తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తుంది. రూ.30 కోట్లకు ఈ సినిమాను కొనుగోలు చేసినట్టు టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
శివ నిర్వాణ సినిమా అంటేనే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మజిలి తర్వాత సమంత, విజయ్ దేవరకొండతో కలిసి దర్శకుడు శివ నిర్వాణతో పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక మరి ఈ సినిమాతో సమంత- విజయ్ ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.