పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పవన్ బ్రో సినిమా షూటింగ్ ముగించుకొని హరీష్ శంకర్- సుజిత్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను కూడా మొదలు పెట్టాడు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఈ యాత్ర కొనసాగుతుంది.
ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై తనదైన రీతిలో విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జరిగిన రోడ్ షోలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న తన తోటి నటులు అంటే కూడా తనకు చాలా ఇష్టమని, అలాగే ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలను ఎప్పుడు మిస్ అవ్వకుండా చూస్తాను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి వైరల్ అవుతూనే ఉన్నాయి.
మరి ముఖంగా పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు కూడా తనకు ఎన్టీఆర్, ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని ఆయన తన మాటల్లో చెప్పకనే చెప్పారు. మరోవైపు పవన్ భార్య అన్నా లెజినోవా కు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే విపరీతమైన ఇష్టమట. ముఖ్యంగా మహేష్ బాబు సినిమాలకు చాలా పెద్ద ఫ్యాన్ అని తెలుస్తుంది. ఇక మరోవైపు మహేష్ భార్య నమ్రత కూడా అన్నా లెజినోవాకు స్నేహితురాలట అన్న విషయం చాలామందికి తెలియదు.
ప్రతి సంవత్సరం వచ్చే క్రిస్మస్ కి మహేష్ దంపతులు క్రమం తప్పకుండా పవన్ దంపతులకు బహుమతులు పంపిస్తూ ఉంటారట. దీనిబట్టి చూస్తే వీరి మధ్య స్నేహం ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మొత్తానికైతే పవన్ మూడో భార్య అన్నా లెజినోవా కు మహేష్ అంటే ఏంతో ఇష్టం అని తెలియటంతో మహేష్ అభీమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోకి పోటి ఇచ్చే మరో హీరో భార్యకు మా హీరో అభిమాని అవ్వటం నిజంగా మాకు చాలా గర్వంగా ఉందంటూ మహేష్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.