బాలకృష్ణ హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్. ఈ హాట్ బ్యూటీ ఎప్పుడో దశాబ్దం క్రితం శివాజీ హీరోగా వచ్చిన ఆలయం సినిమాతో హీరోయిన్గా తెలుగులో అడుగుపెట్టి మొదటి ప్రయత్నంలోనే భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే తన మాతృభాష మలయాళంలో మాత్రం స్టార్ హీరోయిన్గా సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది.
మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా ఉన్న మోహన్ లాల్ , మమ్ముట్టి సురేష్, గోపి వంటి స్టార్స్ తో హనీ రోజ్ ఆడి పాడింది. ఇక అక్కడ హనీ రోజ్ అందానికి ఎంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. 30 సంవత్సరాలు ఈ బ్యూటీ కెరీర్ లో ఎప్పుడు లేనంత ఇమేజ్ ని తెలుగులో బాలయ్య సినిమాతో దక్కించుకుంది. తెలుగు యువత ఈమె అందానికి ఫిదా అయిపోయారంటే మామూలు విషయం కాదు సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
అయితే బాలయ్య సినిమా తర్వాత ఇప్పటివరకు ఈమె తెలుగులో తన తర్వాత సినిమాకి కమిట్ అవలేదు. టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల పక్కన హనీ రోజ్ హీరోయిన్గా సూట్ అవ్వకపోవడంతో తెలుగులో ఆఫర్స్ తక్కువగా వస్తున్నాయి. అయితే మలయాళం, కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎంతో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్గా తన ప్రతి అప్డేట్ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అయితే ఇప్పుడు హనీ రోజ్ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ఐర్లాండ్ లోనే బ్లార్నీ అనే కోట ఉంది. ఇక అక్కడ క్రిస్టియన్స్ కి అది అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఆ కోటపైన బ్లార్నీ స్టోన్ ని క్రిస్టియన్ విశ్వాసాలు కలిగిన అందరూ వంగి మరీ ముద్దు పెడుతూ ఉంటారు. అలా ఆ స్టోన్ కి ముద్దు పెట్టుకుంటే నేరుగా దైవంతో కనెక్ట్ అయినట్లు అని వారి నమ్మకం.
ఇక హనీ రోజ్ కూడా ఎంతో కష్టం మీద పెద్ద సాహసం చేసి మరీ బ్లార్నీ స్టోన్ ని ముద్దు పెట్టుకుంది. ఆ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియ లో షేర్ చేసి అదోక అద్భుతమైన అనుభూతి అని పంచుకుంది. మొత్తానికి నమ్మకాలు కేవలం హిందువులలోనే కాకుండా క్రిస్టియన్స్ లో కూడా బాగా ఉంటాయని బ్లార్నీ స్టోన్ కథ చూస్తే తెలుస్తోంది.