టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలియని వారు ఉండరు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్ల అందరిలో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటుంది. నేచురల్ అందంతో, నటనతో, డాన్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోలకు దూరంగా ఉండు ట్రెడిషనల్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అయితే సాయిపల్లవిని ఒక టాప్ బ్రాండ్ ఫెయిర్నెస్ క్రీమ్ కోసం యాడ్లో నటించమని అడిగితే వెంటనే నో చెప్పిందట..
దానికి ప్రధాన కారణం ఈమె చదువుకునే సమయంలో ఆమె ఊరిలో ఉన్న వాళ్ళందరూ చాలా అందంగా ఉండే వారట. అయితే సాయి పల్లవి మాత్రం పింపుల్స్ తో చాలా అంద వికారంగా ఉండేదాన్ని ఫీల్ అవుతూ ఉండేదట. అదే సమయంలో సాయి పల్లవి తన మొదటి సినిమా ప్రేమమ్ సినిమాలో నటించినప్పుడు కూడా తాను ఎంతో భయపడి పోయిందట. అందరూ హీరోయిన్స్ చాలా అందంగా ఉంటే నేను మాత్రం అలా లేను అని భయంతో ప్రేక్షకులు ఏమనుకుంటారని చాలా బాధపడిపోయిందట. కానీ ప్రేమమ్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది సాయి పల్లవి నటన కూడా ప్రేక్షకులను మెప్పించింది.
ఇక ఎవరు ఆ సినిమాలో సాయి పల్లవి అందాన్ని ముఖాన్ని చూడలేదు ఆమెని నటనను మత్రమే చూశారు. దాంతో ఈమెకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందట. ఈ అమ్మడు సినిమాల్లో కూడా ఎలాంటి మేకప్ వేసుకోకుండా చాలా న్యాచురల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక గ్లామర్ షో కన్నా తన అందమైన నటనతోనే కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి సినిమాలకు దూరంగా ఉంది. ఈమె ఎప్పుడు సినిమా చేస్తుందా..? అని ఆమెఅభిమానాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.’