సీనియర్ యాక్ట్రెస్ జయంతి నేషనల్ ఫిలిం అవార్డు గెలుచుకున్న భార్యాభర్తలు (1961) సినిమా నుంచి తెలుగులో యాక్ట్ చేస్తోంది. ఈ నటి పెదరాయుడు సినిమాలో పాపారాయుడు సోదరిగా, పెదరాయుడు అత్తగా నటించి బాగా మెప్పించింది. కన్నడ, తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ఈమె ప్రొఫెషనల్ లైఫ్ బాగా కొనసాగినప్పటికీ పర్సనల్ లైఫ్ మాత్రం చాలా ఎన్నో బాధలతో నిండిపోయింది. ముఖ్యంగా ఆమెకు పెళ్లిళ్లు అస్సలు అచ్చి రాలేదు.
ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అవన్నీ విడాకులతో ముగిసాయి. జయంతి మొదట టాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు అయిన పేకేటి శివరామ్ని పెళ్లి చేసుకుంది. శివరామ్ దేవదాసు, సువర్ణ సుందరి, ఇల్లరికం గులేబకావళి కథ, అల్లూరి సీతారామరాజు వంటి సూపర్ హిట్ సినిమాలో నటించి బాగా గుర్తింపు దక్కించుకున్నాడు. జయంతిని పెళ్లి చేసుకోక ముందు శివరామ్ గీతని పెళ్లిచేసుకున్నాడు. ఆమెతో వచ్చినట్లే జయంతితో కూడా పేకేటి శివరామ్కి మనస్పర్ధలు వచ్చాయి. చివరికి వారు విడాకులు తీసుకున్నారు.
తర్వాత నిర్మాత చందాన గిరిబాబుని జయంతి రెండో వివాహం చేసుకుంది. ఆ పెళ్లి కూడా మూన్నాళ్ల ముచ్చటయ్యింది. ముచ్చటగా మూడోసారి ఆమె మరొక వ్యక్తిని పెళ్లాడింది. అది కూడా అర్ధాంతరంగా పెటాకులు అయ్యింది. ముగ్గురు భర్తలలో ఆమె పేకేటి శివరావుతో మాత్రమే సంతానం కలిగి ఉంది. ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించగా, అతనికి కృష్ణ కుమార్ అని వారు నామకరణం చేశారు.
అయితే తనకు వైవాహిక జీవితం కొనసాగించే అదృష్టం లేదని జయంతి ఎప్పుడూ బాధపడేది. కనీసం తన కుమారుడి వైవాహిక జీవితమైన బాగుండాలని తపనపడేది. అందుకే ఆమె ఎన్నో రోజులు ఒక మంచి అమ్మాయి కోసం వెతికింది. చివరికి కన్నడ సినీనటి అను ప్రభాకర్కి ఇచ్చి పెళ్లి చేసింది. 2002లో కృష్ణ, అను వివాహ వేడుకను జయంతి అంగరంగ వైభవంగా జరిపించింది.
అయితే కొన్నేళ్ల తర్వాత కృష్ణ, అనుల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. వారి గొడవలను పరిష్కరించడానికి జయంతి ఎంతగానో ట్రై చేసింది. పెద్దలతో రాజీ కుదిర్చి వారి పెళ్లి నిలబెట్టింది. మళ్లీ కొద్ది రోజుల తర్వాత వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరికి అను విడాకుల కోసమై కోర్టును ఆశ్రయించింది. ఇరువురు అనుమతి తీసుకున్న తర్వాత కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. విడాకుల సమయంలో సెటిల్మెంట్ కింద జయంతి అనుకు కోటి రూపాయలు ఇచ్చింది.
కాగా ఎంతో కష్టపడి తన కుమారుడికి పెళ్లి చేసినా అది నిలబడలేదని జయంతి మానసికంగా కృంగిపోయింది. మరోవైపు అను రఘు ముఖర్జీ అనే మరో నటుడిని పెళ్లాడి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇక కృష్ణ కుమార్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేసి తన ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. జయంతి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2021లో చనిపోయింది.