డబ్బు, సమాజంలో హోదా అన్నీ ఉన్నా చాలా మంది సెలబ్రెటీల జీవితాలలో చాలా కష్టాలు ఉంటాయి. అయితే చాలా మట్టుకు అవి బయటకు అంతగా తెలియవు. సుప్రియ కూడా తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంది. ఈ సుప్రియ ఎవరో కాదండోయ్ పవన్ కళ్యాణ్ హీరోగా 1996లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్ అంటే చాలా మందికి గుర్తుంటుంది.
ఆమె టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎంతో మందికి బంధువు. అక్కినేని నాగేశ్వరరావుకు పెద్ద కుమార్తె యార్లగడ్డ సత్యవతికి ఇద్దరు సంతానంలో ఒకరు సుప్రియ. మరొకరు హీరో సుమంత్. ఆమెకు నాగార్జున స్వయానా మేనమామ అవుతారు. ఇలా తన ఇంట్లోనే చాలా మంది హీరోలు, సెలబ్రెటీలు ఉన్నారు. అలాంటి సుప్రియ జీవితంలో చాలా విషాదాలు ఆమెను వెంటాడాయి. సుప్రియ తండ్రి యార్లగడ్డ సురేంద్ర తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు పెద్ద నిర్మాత.
ఇక ఆయన భార్య అయిన సత్యవతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో సుప్రియ, సుమంత్లను అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులే పెంచి పెద్ద చేశారు. 1996లో పవన్ సరసన హీరోయిన్గా ఆమె ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే హీరోయిన్కు ఉండాల్సిన అందం ఆమెకు లేదని ప్రేక్షకులు ఆమెను పట్టించుకోలేదు. ఇక తర్వాత ఇష్టం సినిమాలో హీరోగా చేసిన చరణ్ను ఆమె ప్రేమించి పెళ్లాడింది. ఒక కుమార్తె పుట్టిన తర్వాత కొద్ది కాలానికే చరణ్ కూడా మరణించాడు.
ఇలా చిన్నప్పుడే తల్లిని కోల్పోయి, పెళ్లయ్యాక భర్తను కోల్పోయిన ఆమె చాలా ధైర్యంగా ముందడుగు వేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకుంది. అయితే ఆమె తీరు వల్ల చాలా మంది సినీ ఇండస్ట్రీలో బాధపడ్డారని ప్రచారం ఉంది. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ చేసేటప్పుడు ఏవైనా తప్పులైతే ఆమె బాధ్యులను చెడామడా తిట్టేదట. టాప్ ప్రొడ్యూసర్లు, దర్శకులని కూడా చూడకుండా మాటలు అనేదట.
దీంతో ఇక్కడ షూటింగ్ ఆపేసి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసిన సందర్బాలు ఉన్నాయని కొందరు చెబుతారు. ఇవన్నీ ఎలా ఉన్నా అన్నపూర్ణ స్టూడియోలో తాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేస్తున్నా, ఆ ఉద్యోగానికి వచ్చే జీతంతోనే ఆమె లైఫ్ గడుపుతోంది. ఆ జీతంతోనే తన కుమార్తెను పెంచుతోంది. ఈ విషయాలు ఆమెపై ఇతరులకు మరింత గౌరవాన్ని పెంచుతున్నాయి. సమాజంలో చాలా మంది మహిళలకు ఆమె జీవితం ఆదర్శం.