పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు రాజకీయాలతో బిజీగా కొనసాగుతున్నాడు. ఇదే సమయంలో పవన్ మూడో భార్య అన్నా లెజ్నోవా కూడా ఆయనకు దూరంగా ఉంటున్నట్టు గత వారం రోజులుగా వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈమె కూడా పవన్ కు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందంటూ కూడా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి కూడా కారణం లేకపోలేదు. గత కొంత కాలంగా ఆమె హైదరాబాద్లో ఉండడం లేదన్నది నిజం.
రీసెంట్ గా మెగా ఫ్యామిలీలో జరిగిన వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్కు పవన్ ఒక్కడే వచ్చాడు. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి మెగా కుటుంబం మొత్తం హాజరయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో ఎంతో స్టైలిష్ అవతారంలో మెరిశారు. కానీ ఆయన భార్య అన్నా లెజ్నోవా మాత్రంం రాలేదు. మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా పవన్ భార్య అన్నా వచ్చేది… అలాంటిది ఆమె వరుణ్ ఎంగేజ్మెంట్కు రాలేదు.
దీంతో సహజంగానే అన్నా ఇక్కడ లేకపోవడం… పవన్కు దూరంగా ఉండడం.. కుటుంబంలోనే తన బావ కొడుకు అయిన వరుణ్ ఎంగేజ్మెంట్కు రాకపోవడంతో వీరిద్దరి మధ్య స్పర్థలు తీవ్రంగా ఉన్నాయని.. త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ఒక్కటే ప్రచారం జోరుగా జరిగింది. కానీ అసలు విషయం ఏమిటంటే అన్నా లెజ్నోవా వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి రాకపోవటానికి ఈమె గత కొన్ని రోజులుగా రష్యాలో ఉండడమే..!
అన్నా తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గత కొన్ని నెలల ముందే రష్యా కు వెళ్లి తన తల్లికి తోడుగా ఉంటుంది. ఇక వీరిని రష్యా పంపించింది కూడా పవన్ కళ్యాణ్. ఈ విషయం తెలియని కొంతమంది కావాలనే పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా మద్య దూరం పెరిగింది… అందుకే ఆమె వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్కు కాలేదంటూ ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు.