పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన ఆది పురుష్ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక ప్రభాస్ అంచనాలను రెట్టింపు చేస్తూ ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. తొలిరోజు కలెక్షన్లో కూడా ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా అందుకుంది. ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన విధానంపై ప్రేక్షకులు తీవ్ర స్థాయిల విమర్శలు చేస్తున్నారు.
సినిమా వి ఎఫ్ ఎక్స్ పై ముందు నుంచే నెగటివ్ వచ్చినప్పటికీ సినిమాల్లో కూడా విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేవని విమర్శలు వస్తున్నాయి. అలాగే ఈ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాను ఓం రౌత్ మరో కొత్త రామాయణాన్ని రచించాడనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ సినిమాలో కొన్ని డైలాగులు కూడా ఈ సినిమాకు మైనస్ అని విమర్శలు వస్తున్నాయి.
ప్రధానంగా మన తెలుగు సినిమాల్లో ఫ్యాక్షన్ తరహా డైలాగులు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలయ్య. అందులోనూ గుక్క తిప్పకుండా ఫ్యాక్షన్ డైలాగులు చెప్పాలంటే బాలయ్య తర్వాతే ఎవరైనా.. నీ ఇంటికొస్తా.. నీ నట్టింటికొస్తా’.. అనే డైలాగ్ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే తరహా డైలాగ్ ను దర్శకుడు ఓం రౌత్ ఆది పురుష్ సినిమాలో పెట్టాడా అనేలా ఓడైలాగ్ ఉంది. నెటిజన్లు ఆ డైలాగ్ బాలయ్య స్టైల్లో ఉందని ఆడుకుంటున్నారు.
ప్రధానంగా హనుమంతుడు లంకలో తైలం ‘నీ బాబుది, కాలేది కూడా నీ బాబుదే’ అని వచ్చే ఈ డైలాగును రెగ్యులర్ మాస్ సినిమాల్లో మాదిరిగా ఇందులో పెట్టడం ప్రేక్షకులకు అసలు నచ్చలేదు. అయితే ఈ సినిమాపై వివాదాలు వస్తాయని ముందుగానే ఉహించిన దర్శకుడు ఓం రౌత్ . అందుకే ఈ సినిమా మొదటిలోనే ఇది తన ఊహలతో తీసిన సినిమా అని చెప్పుకొచ్చాడు.
ఇదే సమయంలో ఈ సినిమాలో అన్ని విషయాలు ఎలా ఉన్నా విలన్ గా సైఫ్ అలీ ఖాన్ పాత్ర సినిమాకి మైనస్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సినిమాపై ఎన్ని ట్రోలింగ్లు వచ్చినా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ అభిప్రాయంతోనే ఉన్నారు. అయితే ప్రేక్షకులు ఎంతగానో ఆరాధించే రాముడు సినిమా కాబట్టి దర్శకుడు మరింత జాగ్రత్తలు తీసుకుంటే ఈ సినిమా మరింత బాగుండదని అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.