చిరంజీవికి వీరాభిమాని నాగ‌బాబుకు ఎలా భార్య‌గా మారిందంటే..ఇంట్ర‌స్టింగ్ పెళ్లి క‌థ‌

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అలానే వారి పెళ్లిళ్ల విషయాల గురించి కూడా అందరికి తెలిసిన విషయమే. తాజాగా జరిగిన ఒక ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడిన వీడియో అందరు చూసే ఉంటారు. అందులో చిరంజీవి తన పెళ్లి ఎలా జరిగిందో, ఆ పెళ్ళికి డేట్స్ దొరకక ఎన్ని ఇబ్బందులు పడ్డారో కూడా ఆ ఈవెంట్ లో మెగా స్టార్ చెప్పారు. ఆ వీడియో ఇప్పటికి నెట్టింట హల్ చల్ చేస్తుంది.

అలానే మెగా స్టార్ చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కూడా కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయన పెళ్లి టాపిక్ అయితే ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. మూడు పెళ్లిళ్లు, ముగ్గురు భార్యల గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అయితే ఇలా వీరిద్దరే కాదు నాగబాబు పెళ్లి గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

అసలు నాగబాబు భార్య ప‌ద్మ‌జ గురించి పెద్దగా ఎవ్వరికి తెలియదు. నాగబాబు 29 ఏళ్ళ వయసులో ప‌ద్మ‌జతో ఏడ‌డుగులు వేశాడు. ఇప్పుడైతే మెగా ఫ్యామిలిలో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి కానీ అప్పుడు అన్ని పెద్దలు కుదిర్చిన వివాహాలే. నాగబాబు, పద్మజది కూడా పెద్ద‌లు కుదిర్చిన పెళ్లే. అయితే ఈ సంబందం మెగా కుటుంబంలోకి ఎలా వచ్చింది అంటే..నాగ‌బాబు త‌ల్లి అంజనాదేవి పాల‌కొల్లులో బంధువుల వివాహంలో మొదటిసారి ప‌ద్మ‌జ‌ను చేసారంట. అప్పుడే పద్మజ ప‌ద్మ‌జ అంజనాదేవిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ట‌.

Naga Babu wife warning: ఎక్స్ ట్రాలు చేస్తే పీక కోస్తా.. నాగబాబు భార్య  స్ట్రాంగ్ వార్నింగ్.. | Mega Brother Naga Babu wife Padmaja Konidela strong  warning to her husband about second marriage pk ...

వెంటనే అంజనాదేవి ఈ అమ్మాయి చాలా లక్షణంగా ఉంది, మన ఇంటి కోడలు అయితే బాగుంటుందని అలోచించి నాగబాబుకి పద్మజనే ఫిక్స్ అయిపోయారు. మెగా ఇంట్లో కూడా అందరికి నచ్చడంతో వెంటనే సంబంధం మాట్లాడేసుకున్నార‌ట‌. వీరిద్దరికి ఘ‌నంగా వివాహం చేశారు. పెళ్లి త‌ర్వాత ప‌ద్మ‌జ సంపూర్ణ గృహిణిగా మారింది. వీరిద్దరికి వ‌రుణ్ తేజ్‌, నిహారిక జ‌న్మించారు. నిహారిక‌కు ఆల్రెడీ పెళ్లి అవ్వ‌గా.. వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లోనే లావ‌ణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఇదివరకే గ్రాండ్ గా జరిగింది.

అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. నాగబాబు భారీ చిన్న‌త‌నం నుంచి మెగాస్టార్ చిరంజీవికి విరాభిమాని. చిరంజీవికి సంబంధించిన అనేక పేపర్ కటింగ్స్ ను సేక‌రించి ఒక బుక్ లాగా కూడా తయారు చేసుకున్నారట. మొత్తానికి అభిమాన హీరో ఇంటికే ప‌ద్మ‌జ కోడ‌లిగా వెళ్ళింది.