మెగా కుటుంబంలో ఎప్పుడూ పవన్ కళ్యాణ్పై విరుచుకు పడుతూ ఉంటుంది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీలో వారాహి యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు తొలి రోజే జనాల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. వెంటనే శ్రీరెడ్డి ఈ యాత్రపై కౌంటర్ వేసేసింది. తన ట్విట్టర్లో నన్ను కూడా ఎక్కించుకుని రెండు రౌండ్లు వేయవచ్చుగా అని కామెంట్ చేసింది.
ఇటీవల శ్రీరెడ్డి కేవలం సినిమాల మీదే కాకుండా ఏపీ రాజకీయాలపై కూడా బాగా ఫోకస్ చేస్తోంది. ఏపీ రాజకీయాలతో పాటు తెలుగుదేశం, జనసేనను టార్గెట్గా చేసుకుని రకరకాల విమర్శలు చేస్తోంది. వైసీపీకి అనుకూలంగా ట్వీట్లు, కామెంట్లు చేసే శ్రీరెడ్డి ఒక్కోసారి ఆ పార్టీ వాళ్లపై కూడా రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉంటుంది.
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ను టార్గెట్ గా చేసుకుని నీ వారాహి రథంలో నన్ను కూడా ఎక్కించుకుని రెండు రౌండ్లు వేయి బావా అంటూ కామెంట్ చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అటు జనసేనను టార్గెట్ చేసే వాళ్లు కూడా ఈ కామెంట్ను వైరల్ చేస్తున్నారు. అయితే శ్రీరెడ్డిపై పవన్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. అమ్మనా బూతులు తిడుతున్నారు.