ఏదైనా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాని వెనక ఎంతో మంది ఎన్నో రోజుల పడిన శ్రమ ఉంటుంది. అయితే వారంతా ఓ సినిమా కోసం ఓ కుటుంబంలా కలిసి పనిచేయటం వల్ల అందరికీ అందులో మంచి జ్ఞాపకాలు మిగులుతాయి. అలాంటి ఓ అరుదైన మంచి జ్ఞాపకాన్నే బాలయ్య, విజయనిర్మల ఓ షూటింగ్ సమయంలో అందరికీ అందించారు.
బాలకృష్ణ హీరోగా వచ్చిన “సుల్తాన్” సినిమా సమయంలో ఈ అరుదైన సంఘటన జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య హీరోయిజం, విజయనిర్మల గారి చేతివాటం బయటపడ్డాయి. 1999లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో బాలయ్య తో పాటుగా కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ కూడా ముఖ్యపాత్రలో నటించారు.
దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాను అండమాన్ లో తెరకెక్కిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఎలాంటి గెస్ట్ హౌస్ లు లేవు. అది కూడా ఒకే ఒక రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ంటే, అక్కడే ఈ సినిమాకు సంబంధించిన అందరూ అక్కడే దిగారు. అదే సమయంలో షూటింగ్ జరిగే ప్రదేశానికి ఆ గెస్ట్ హౌస్ కి చాలా దూరం ఉండేది. షూటింగ్ ప్రదేశానికి వచ్చాక అందరు ఆహారం లేక బిస్కెట్లు తిని షూటింగ్ లు చేసేవారట. అదే సమయంలో రెండో రోజు ఇదంతా కాదని విజయనిర్మల గారు అక్కడికక్కడే వంట సామాన్లు తెప్పించి వంట చేయటం మొదలుపెట్టారట.
ఇక మరోవైపు బాలకృష్ణ కూడా సముద్రం దగ్గరికి వెళ్లి చేపలు పట్టి తెచ్చేవారట. ఆ చేపలతో విజయనిర్మల ఎంతో చక్కగా చేపల కూర వండేవారట. ఈ సినిమా గురించి ఎప్పుడు ఏ టాపిక్ వచ్చినా బాలయ్య బాబు సింప్లిసిటీ గురించి విజయనిర్మల కమ్మని వంటలు గురించి జ్ఞాపకాలు చెప్పుకుంటూనే ఉంటారు. ప్రస్తుతం ఈ చేపల కూర ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!