దర్శక ధీరుడు రాజమౌళి ఒక తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా మన భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వించతగ్గ దర్శకులలో ఒకరు. మన భారతీయ సినిమాకి తన దర్శకత్వ ప్రతిభతో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుని తీసుకువచ్చిన దర్శక ధీరుడు. అలాంటి ఈ విజనరీ దర్శకుడు తో సినిమా చేయాలని ఎందరో అగ్ర హీరోలు ఆశపడుతూ ఉంటారు.
అసలు విషయానికి వస్తే రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాకు ముందు ఆయన ఒక సాధారణ దర్శకుడు మాత్రమే. వరుసగా ఆయన చేతిలో భారీ విజయాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన సినిమాలు మాత్రం లేవు. ఇక అలాంటి సమయంలోనే వచ్చింది మగధీర ఒక్కసారిగా రాజమౌళి క్రేజ్ ని అమాంతం పెంచేసింది.
ఈ సినిమాతో రాజమౌళి క్రేజ్ ఒక్కసారిగా ఆకాశానికి చేరిపోయింది. ఇక ఆ సమయంలోనే ఎవరు ఊహించిన విధంగా తన రేంజ్ను తగ్గించుకుంటూ స్టార్ కమెడియన్ సునీల్ తో మర్యాద రామన్న సినిమా చేశారు. ఈ సినిమా కూడా ఆ రోజుల్లో కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింద. ఆ రోజుల్లోనే ఈ సినిమా సుమారు రూ.34 కోట్ల పైగా వసూలుల్ రాబట్టింది.
అయితే ఈ సినిమాకి రాజమౌళి సునీల్ను కాకుండా మరో కొంతమంది హీరోలను కూడా సంప్రదించారట. అలా సంప్రదించిన వారిలో అల్లరి నరేష్ కూడా ఒకరు. నరేష్ కు రాజమౌళి ఈ సినిమా స్టోరీ చెప్పగానే ఆయన చేయడానికి ఓకే చెప్పేసాడు. కానీ అదే సమయంలో సంవత్సరానికి అరడజన్ కి పైగా సినిమాలు చేసే నరేష్ ని ఈ సినిమా పూర్తయ్యేంతవరకు మరో సినిమా చేయకూడదని రాజమౌళి కండిషన్ పెట్టారట.
అందుకు నరేష్ ఒప్పుకోలేదట. ఇక దీంతో ఆ ప్రాజెక్టు నుంచి నరేష్ తప్పుకున్నాడు ఇక అప్పుడు ఈ స్టోరీ లోకి సునీల్ వచ్చాడు. ఆ తర్వాత సినిమా విడుదలై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది. అదే సమయంలో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అల్లరి నరేష్ కి ఈ సినిమా సరిపోతుందని అనిపించింది. ఎందుకంటే ఆయన తన కెరీర్లు ఇలాంటి పాత్రలు ఎక్కువగా పోషిస్తూ వచ్చాడు. అలా అల్లరి నరేష్ ఇంత పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ ని మిస్ అయ్యాడట.