టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి ఒకరు కాగా ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్, నాగార్జున, మహేష్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు డైరెక్టర్ గా వంశీ పైడిపల్లి వ్యవహరించారు. మున్నా మినహా ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలు నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించాయి.
తమిళంలో కూడా ఈ దర్శకుడికి మంచి పేరు ఉంది. అటు దిల్ రాజుకు ఇటు మహేష్ బాబుకు అత్యంత సన్నిహితులలో వంశీ పైడిపల్లి ఒకరు. అయితే ఈ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడానికి మాత్రం ఏ హీరో సిద్ధంగా లేడు. 17 సంవత్సరాల సినీ కెరీర్ లో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన సినిమాలు కేవలం ఆరంటే ఆరు మాత్రమే కావడం గమనార్హం. అయితే వంశీ పైడిపల్లికి ఒక విచిత్రమైన ప్రాబ్లమ్ ఉంది.
తన సినిమాలకు ఈ డైరెక్టర్ చాలా సందర్భాల్లో సొంతంగా కథ రాసుకోలేరు. ఈ సమస్య వల్లే వంశీ పైడిపల్లి ఎక్కువగా సినిమాలను తెరకెక్కించలేకపోయారని తెలుస్తోంది. అదే సమయంలో ఈ డైరెక్టర్ సినిమాల బడ్జెట్ విషయంలో చాలా సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ రీజన్స్ వల్ల వంశీ పైడిపల్లి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలో స్టార్ హీరోలు వెనుకడుగు వేస్తున్నారు.
వంశీ పైడిపల్లి తమిళ హీరోలపై ఫోకస్ పెట్టడం వెనుక అసలు కారణం ఇదేనని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి ఈ విషయాలకు సంబంధించి మారితే మాత్రమే ఆయన కెరీర్ కు ప్లస్ అవుతుంది. రాజమౌళి కంటే నిదానంగా ఈ డైరెక్టర్ కెరీర్ విషయంలో ముందుకెళుతున్నారు. ఫ్యామిలీ కథలతో సినిమాలను తెరకెక్కించే వంశీ పైడిపల్లి ఇంత గ్యాప్ తో సినిమాలు తీయడం ఆయన కెరీర్ కు మంచిది కాదు.
మరోవైపు ఈ డైరెక్టర్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లోనే ఉందని సమాచారం. వంశీ పైడిపల్లి ఇకనైనా కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. కొంతమంది మిడిల్ రేంజ్ హీరోలు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నా స్టార్ హీరోలతోనే పని చేయాలని వంశీ భావిస్తున్నారు. వంశీ పైడిపల్లి త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది.