బంట్రోతు భార్య, తూర్పు పడమర, ఇంద్రుడు చంద్రుడు వంటి సినిమాల్లో నటించి తెలుగు వారికి దగ్గరయింది సీనియర్ నటి శ్రీవిద్య. మలయాళ, తమిళ సినిమాలలో ఎక్కువగా కనిపించే ఈ ముద్దుగుమ్మ చాలా తెలుగు సినిమాల్లో కూడా నటించి అలరించింది. చివరగా విజయ్ ఐపీఎస్ సినిమాలో హీరో తల్లి పాత్ర పోషించింది. అదే ఆమె నటించిన ఆఖరి తెలుగు సినిమా.
శ్రీవిద్య సినీ కెరీర్ బాగానే కొనసాగింది కానీ ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొంది. ఈ తార దిగ్గజ నటుడు కమల్ హాసన్తో కలిసి చాలా తమిళ సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. శ్రీవిద్యకి కమల్ హాసన్ అంటే విపరీతమైన పిచ్చి ఏర్పడింది. ఆమె ఒకానొక సమయంలో అతన్ని విడిచి ఉండలేని స్థితికి చేరుకుంది.
ఆ క్రమంలోనే కమలహాసన్ వాణి గణపతితో సహజీవనం చేస్తున్నాడని తెలిసి ఆమె ఎంతో మానసిక క్షోభకు లోనయ్యింది. తర్వాత కమల్ హాసన్ వాణి గణపతిని పెళ్లి చేసుకోవడంతో ఆమె అతనిపై తన ప్రేమను చంపుకోవాల్సి వచ్చింది. తరువాత ఆమె అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసిన దర్శకుడు భరతన్తో ప్రేమలో పడింది. కానీ ఆ ప్రేమ కూడా ఎంతో కాలం నిలవలేదు.
కొన్నేళ్ళకు భరతన్ KPAC లలితను వివాహం చేసుకున్నాడు. చివరికి శ్రీవిద్య తన మలయాళ మూవీ టీక్కనల్లో సహాయ దర్శకుడిగా పనిచేసిన జార్జ్ థామస్తో ప్రేమలో పడింది. అతడిని పెళ్లి చేసుకోవద్దని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా శ్రీవిద్య 1978లో అతనిని వివాహం చేసుకుంది. జార్జ్ కోరుకున్నట్లుగా, ఆమె వివాహానికి ముందు బాప్టిజం పొందింది. పెళ్లయిన తర్వాత సినిమాలకి స్వస్తి చెప్పి హాయిగా హౌజ్వైఫ్గా లైఫ్ లీడ్ చేయాలనుకుంది.
కానీ ఆర్థిక సమస్యల కారణంగా జార్జ్ ఆమెను బలవంతం చేయడంతో మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. అతడిని పెళ్లి చేసుకోవడం పని చేసిన పెద్ద తప్పు అని ఆమె త్వరగానే గ్రహించింది. జార్జ్ని పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం దుర్భరంగా మారింది. చివరికి అతడిని భరించలేక ఆమె 1980లో విడాకులు తీసుకుంది.
అయితే అప్పటికే జార్జి ఆమె ఆస్తులు అన్నీ లాగేసుకున్నాడు. దీంతో ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేసి చివరికి తన ఆస్తులు తాను దక్కించుకోగలిగింది. ఆఖరి రోజుల్లో ఆమె అనారోగ్యంతో బాధపడుతూ 2006లో 53 ఏళ్ల వయసులో మరణించింది.