సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా సక్సెస్ కావాలని ఎన్నో ఆశలతో చాలామంది డైరెక్టర్లు తమ ప్రయాణాన్ని మొదలుపెడతారు. ఈ ప్రయాణంలో కొంతమంది డైరెక్టర్లుగా సక్సెస్ అయితే మరి కొందరు మాత్రం డైరెక్టర్లుగా ఫెయిల్ అవుతుంటారు. భద్ర సినిమాతో దర్శకునిగా బోయపాటి శ్రీను ప్రయాణం ప్రయాణం మొదలైందనే సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
అయితే భద్ర సినిమా రిలీజ్ సమయంలో ఈ సినిమాకు మరీ పాజిటివ్ టాక్ రాలేదు. ఎక్కువమంది ఈ సినిమాను చూసి ఒక్కడు కథను కొంచెం మార్చి ఈ సినిమాను తెరకెక్కించారని కామెంట్లు చేశారు. ఒక్కడు మూవీకి ఈ సినిమాకు చాలా పోలికలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు సినిమాలలో హీరో హీరోయిన్ ను దాచే ప్రయత్నం చేయడంతో పాటు హీరోయిన్ ఫ్యామిలీ చనిపోవడం జరుగుతుంది. ఈ రెండు సినిమాలలో హీరోయిన్ పాత్రలు సైతం సిమిలర్ గా ఉంటాయి. రెండు సినిమాలలో ఎయిర్ పోర్ట్ సన్నివేశాలు కూడా ఉంటాయి.
అయితే భద్ర సినిమా రిలీజైన కొన్ని రోజుల తర్వాత పాజిటివ్ టాక్ తో నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలను అందించింది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను పారితోషికం కేవలం 5 లక్షల రూపాయలు కావడం గమనార్హం. భద్ర సినిమా ఇతర భాషల్లో రీమేక్ కాగా రీమేక్ రైట్స్ లో సగం మొత్తం దర్శకుడికి దక్కాల్సి ఉన్నా బోయపాటి శ్రీనుకు దక్కలేదు. ఒక ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించినా ఇమేజ్ మారిపోతుందని చాలామంది హీరోలు భావిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమా అటు రామ్, ఇటు బోయపాటి శ్రీను కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.