దర్శక ధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత తన నెక్ట్స్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తానని ప్రకటించాడు. ఈ మూవీ ప్రకటన వచ్చేనప్పటి నుంచే సినిమాపై టాలీవుడ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథకు సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ గా మారాయి.
రాజమౌళి సినిమాలకు కథ అందించే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాను అమెజాన్ ఫారెస్ట్ అడువుల నేపథ్యంలో భారీ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతుందంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మహేష్ బాబుని ఈ సినిమాలో ఇప్పటివరకు మనం చూడని రీతిలో రాజమౌళి చూపించబోతున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్ తన 28వ సినిమా గుంటూరు కారం త్రివిక్రమ్తో చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సమయంలో ఆగస్టు నెలలో మహేష్ పుట్టినరోజు సందర్భంగా మహేష్- రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజమౌళి డైరెక్షన్లో విక్రమార్కుడు లాంటి సెన్సేషనల్ హిట్ సినిమాలో నటించిన రవితేజ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడు. త్వరలోనే దీనిపై కూడా అధికార ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది. మరి మహేష్ – రవితేజ కాంబోలో రాజమౌళి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.