మెగా ఫ్యామిలీలో తీవ్ర విషాదం..ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మెగా హీరో..అసలేం జరిగిందంటే..!

ప్రస్తుత కాలంలో మూగజీవాలను ప్రేమించే వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. అందులో కేవలం సామాన్య ప్రజలే కాకుండా.. రాజకీయ నాయకులు సెలబ్రిటీలు సినిమా వాళ్లు కూడా మూగజీవులను పెంచుతూ తమ ప్రేమను చూపిస్తున్నారు. అలా కొందరు కుక్కల‌ను, కుక్క‌ పిల్లల‌ను ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకుంటూ వాటిని సొంత బిడ్డల్లా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని జాగ్రత్తగా పెంచుతారు. అయితే ఇప్పటివరకు మనం ఎక్కువగా చిత్ర పరిశ్రమలో కుక్కలను, కుక్క‌పిల్లలను పెంచుకునే హీరోయిన్లను చూసుంటాం. అదే హీరోలలో చాలా రేర్..మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోల్లో చాలా తక్కువ.. అలా వారిలో ఒకరు సాయిధరమ్ తేజ్.

Sai Dharam Tej with his pet dog | Celebrities InfoSeeMedia

ఈ మెగా హీరో మొదటి నుంచి మూగ జీవాలు అంటే ఎంతో ఇష్టం. ఎప్పటినుంచో తనకు ఇష్టమైన ఒక్క కుక్కని పెంచుకుంటూ వస్తున్నాడు. ఇక తేజ్‌ తన కుక్కకు ట్యాంగో అనే పేరు కూడా పెట్టాడు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ట్యాంగోతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కూడా షేర్ చేస్తూ వచ్చాడు. కాగా ఇప్పుడు ఈ మెగా ఫ్యామిలీలో విషాదంం చోటుచేసుకుంది. సాయి ధరమ్‌తేజ్ కు ఎంతో ఇష్టమైన కుక్క ట్యాంగో చనిపోవడంతో ఇక తనకు ఇష్టమైన కుక్కతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.

18 Telugu actors and their adorable pets | Times of India

ఇక ఈ కుక్క తనకు చిన్నగా ఉన్నప్పుడు నుంచి తన దగ్గర ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యాడు.. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తపరుస్తూ.. ఓ లెటర్ ను షేర్ చేశాడు.. అందులో నిన్ను తలుచుకున్నప్పుడు నా మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. నువ్వు లేకపోతే నాకు చాలా కష్టంగా ఉంది. నువ్వు నన్ను రక్షించావు.. నవ్వించావు, నా కష్టాల్లో, నా సంతోషాల్లో నువ్వు ఎప్పుడూ నాకు తోడుగా నిలిచావు. ఎన్నో విషయాల్లో నేను నీతో షేర్ చేసుకున్నాను. ఇక నువ్వు నాకు ఎంతో ప్రేమను ఇచ్చిన నువ్వు ఇప్పుడు నా జీవితం లేకపోవడం నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఇక నువ్వు నా జీవితంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ఎప్పుడు స్పెషల్ గానే ఉంది లవ్ యు మై బండ ఫెలో టాంగో” అంటూ చాలా ఎమోషనల్ గా ఆ లెటర్ లో రాసుకోచ్చాడు. సాయిధరమ్ తేజ్ పోస్ట్ పై ఆయన అభిమానులు ఎంతో బాధగా కామెంట్లు కూడా చేస్తున్నారు.