భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన అతిలోక సుందరి, దివంగత హీరోయిన్ శ్రీదేవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ను మొదలుపెట్టిన శ్రీదేవి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా దశాబ్దాల పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో చక్రం తిప్పింది. ఇక ఇటు టాలీవుడ్ తోటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో తిరుగులేని రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఎందరో కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.
ఇదే సమయంలో శ్రీదేవి తన కెరీర్ పరంగా ఎంత సక్సెస్ అయినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీకపూర్న శ్రీదేవి పెళ్లి చేసుకుంది ఇక వీరికి జాన్వీ కపూర్, ఖుషి కపురనే ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. ఇక ఇదే సమయంలో శ్రీదేవి పెళ్లి విషయంలో చాలా పెద్ద తతంగమే జరిగిందట. ఆమెతో పెళ్లికి ఎందరో స్టార్ హీరోలు కూడా తిరస్కరించారట. వారిలో టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో డాక్టర్ రాజశేఖర్ కూడా ఒకరు.
రాజశేఖర్ హీరోగా కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో రాజశేఖర్ అందం, గుణం నచ్చి శ్రీదేవి తల్లి రాజశేఖర్ కుటుంబంతో పెళ్లి సంబంధం మాట్లాడిందట. అదే సమయంలో తమ ఇంటికి హీరోయిన్ ని కోడలుగా తెచ్చుకోవడం రాజశేఖర్ తల్లిదండ్రులకు ఇష్టం లేదని మొహమాటం లేకుండా చెప్పేశారట. ఇక ఆ తర్వాత రాజశేఖర్ మరో నటి జీవితాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
అదేవిధంగా శ్రీదేవి పెళ్లిని మరో అగ్ర నటుడు మురళీమోహన్ కూడా తిరస్కరించారట. ఆయన కూడా తన కెరీర్ మొదటిలో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక ఆమెకు నో చెప్పారట. ఇక అదే విధంగా మెగాస్టార్ చిరంజీవిని కూడా శ్రీదేవి తల్లి పెళ్లి చేసుకోమని ప్రపోజల్ కూడా పెట్టిందట . ఆయన కూడా ఈ ప్రపోజల్ ని తిరస్కరించారని టాక్ కూడా ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్న శ్రీదేవి ఆ తర్వాత కొన్నాళ్లకే విడిపోయారు. ఇక ఫైనల్ గా 1996 లో బోనీ కపూర్ తో ఓ గుడిలో ఏడడుగులు వేసింది. బోనీ కపూర్ కు కూడా అప్పటికే పెళ్లై పిల్లలు ఉండటం గమనార్హం.