నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు ఒకదానిని మించిన బ్లాక్బస్టర్లు మరొకటి. సింహా, లెజెండ్, అఖండ మూడు పెద్ద సూపర్ హిట్లు కొట్టాయి. ఇక అఖండ అయితే కరోనా కష్టకాలంలో వచ్చి కూడా పెద్ద సక్సెస్ అయ్యింది. బాలయ్య కెరీర్ లో ఆల్ టైం వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కేసింది.
అయితే గత కొద్ది రోజులుగా అఖండ 2 సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. బాలయ్య కూడా అఖండ 2 సినిమా ఉంటుందని ప్రకటన చేసేశాడు. దీంతో అఖండ వచ్చేస్తుందని నందమూరి అభిమానులు, బాలయ్య అభిమానులు ఒక్కటే సంబరాలు చేసుకుంటున్నారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ 2 సినిమాను అధికారికంగా లాంఛ్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగా అఖండ 2 స్టార్ట్ కాలేదు. బాలయ్య బర్త్ డే రోజునే బాలయ్య – దర్శకుడు బాబీ సినిమా గురించి అప్ డేట్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య బిగ్గెస్ట్ హిట్ కొట్టిన దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబీ) తో బాలయ్య కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
దీంతో బాలయ్య అభిమానులు మేం 2024 ఎన్నికలకు ముందు బోయపాటి సినిమాను చూస్తామనుకున్నామని… బోయపాటి రామ్ సినిమాను పదే పదే చెక్కి ఆలస్యం చేస్తున్నారని.. ఇటు బాలయ్య అఖండ 2 సినిమాకు కూడా ఇంకా కథ రెడీ చేయలేకపోయారంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. బోయపాటి మమ్మలను బాగా డిజప్పాయింట్ చేశారని వారు సోషల్ మీడియాలో బోయపాటిపై ఫైర్ అవుతున్నారు. ఇక 2024లో అఖండ 2 స్టార్ట్ కానుందని తెలుస్తోంది.