ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సమంత.. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్గా తన కెరీర్లో పిక్స్ లో ఉన్న టైంలోనే తను తొలి సినిమా హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్లకే అతనితో డైవర్స్ అవడంతో ఆమె కెరీర్ కొంత రిస్క్లో పడేసింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లో బిజీ అయింది. అంతలోనే మయోసైటస్ అనే వ్యాధితో కొద్ది రోజులు ఇబ్బంది పడింది.
అయినా కూడా తనకు వచ్చిన అవకాశాలను వదలకుండా సినిమాలు చేస్తూ వస్తోంది సమంత.
టాలీవుడ్ లో గ్లామర్ పాత్రల కన్నా ప్రయోగాత్మక సినిమాలో చేయాలని ఫిక్స్ అయిన సమంత శాకుంతలం సినిమా ఇచ్చిన రిజల్ట్తో తన ఆలోచన మార్చుకుంది. ఇక ఇదే సమయంలో మరో పక్క బాలీవుడ్ లో కూడా సమంత వరుస వెబ్ సిరీస్లతో దూసుకుపోతుంది.
ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమంత .. మరో కొత్త వెబ్ సిరీస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే సమయంలో తనకు స్టార్ స్టేటస్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్ని వదులుకోవటం సమంతకి ఇష్టం లేదు. అందుకే సమంత టాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలని భావిస్తుంది. కానీ సమంతకు తెలుగులో సరైన ఆఫర్లు రావడం లేదు.
అసలు తెలుగులో ఉన్న స్టార్ హీరోలైతే సమంతని అసలు పట్టించుకోవట్లేదని తెలుస్తుంది. ఎవరైనా దర్శక, నిర్మాతలు స్టార్ హీరోలకి సమంతని రిఫర్ చేసినా వారు నో చెప్పేస్తున్నారట. సమంత ఏ సినిమాలో చేసిన సరే ఆ సినిమాపై ఆటోమేటిక్గా నెగెటివిటీ వచ్చేలా చేసుకుంటోంది. అందుకే స్టార్ హీరోల సినిమాల్లో సమంతని తీసుకోవటానికి ఆలోచిస్తున్నారు. అయితే సమంత మాత్రం ఎవరు అవకాశం ఇచ్చిన ఇవ్వకపోయినా.. తన మార్కు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రావాలని ఫిక్స్ అయిపోయింది.
అంతేకాకుండా యువర్ హీరోల సినిమాల్లో నటించి తన సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికే యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయడానికి సమంత కమిట్ అయింది. ఇక ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కిస్తోంది. దీంతో మరో ఒకరిద్దరు యంగ్ హీరోల సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నాయే తప్పా సీనియర్ హీరోలు మాత్రం ఆమెను అస్సలు పట్టించుకోవట్లేదు.