సినిమాల్లో డబుల్ హిట్టు కొట్టిన వారు చాలా మంది ఉన్నారు. సినిమాల్లో తమకు తిరుగులేదని చాటింపు వేసుకున్నవారు కూడా ఉన్నారు. ఒకే సినిమాలు ఏళ్ల తరబడి ఆడిన వారు కూడా ఉన్నారు. అయితే.. అనూ హ్య కారణాలతో రాజకీయాల్లోకి వచ్చిన నటులు మాత్రం సింగిల్ హిట్తో సరిపెట్టుకున్నారు. ఇలాంటి వారిలో చాలా మంది అగ్రశ్రేణి తారలు ఉండడం గమనార్హం. వీరంతా సినిమాల్లో హిట్టయినా.. పొలిటికల్గా మాత్రం ఫట్టయ్యారు.
వీరిలో హీరోల నుంచి హీరోయిన్ల వరకు.. కమెడియన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు చాలా మందే ఉన్నా రు. హీరో కృష్ణ ఏలూరు నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత.. ఆయన మరెక్కడా గెలవ లేక పోయారు. రాజమండ్రి నుంచి పార్లమెంటుకు ఎన్నికైన జమున తర్వాత కాలంలో రాణించే ప్రయత్నం చేయలేక పోయారు.
అలాగే ఊర్వశి శారద కూడా తెనాలి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కానీ, తర్వాత మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అగ్రతార జయసుధ సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు గుర్రం ఎక్కారు. ప్రస్తుతం రాజకీయాలకు దూ రంగా ఉంటున్నారు. ఇక, క్యారెక్టర్ ఆర్టిస్టు.. కైకాల సత్యనారాయణ కూడా ఒకసారి ఎంపీ అయ్యారు. తర్వాత .. రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఇక, అటు కమెడియన్, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరున్న కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అంతే.. తర్వాత మళ్లీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
అదేవిధంగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కూడా బాపట్ల నుంచి ఎంపీగా విజయం దక్కించు కున్నారు. తర్వాత అనూహ్యంగా ఆయన కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. హీరో కృష్ణం రాజు కూడా నరసాపురం నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.
తర్వాత.. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నా.. మళ్లీ యాక్టివ్ అయ్యారు. సీనియర్ నటుడు కొంగర జగ్గయ్య ఒంగోలు నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు. ఇలా.. అనేక మంది తారలు.. కార్యక్టర్ ఆర్టిస్టులు రాజకీయాల్లోకి ఇలా వచ్చి.. అలా వెళ్లిపోవడం గమనార్హం. అయితే.. ఇలా చేసినా..కూడా కృష్ణ, జమున, రామానాయుడు వంటివారు… మాత్రం ప్రజలకు చిరకాలం గుర్తుండి పోయారు.