బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో భారతీయ చిత్ర పరిశ్రమలోనే దూసుకుపోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. ఆ తర్వాత మరో పాన్ ఇండియా సినిమా సలార్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రభాస్.
ఇదే సమయంలో ప్రభాస్ కెరియర్ లోనే బెస్ట్ సినిమాలలో ఒకటి బుజ్జిగాడు. ఈ సినిమా కమర్షియల్ గా సరిగా ఆడకపోయినా ప్రభాస్ యాక్టింగ్ పరంగా అదరగొట్టాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్కు జంటగా త్రిష హీరోయిన్ గా నటించింది. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా హీరోయిన్ కు అన్నయ్యగా నటించాడు.
ఈ సినిమాలో శివన్నగా మోహన్బాబు తన మార్కు నటనతో ఆకట్టుకున్నాడు. ఇదే సమయంలో ఈ సినిమాలో మోహన్ బాబు పాత్రకి ముందుగా వేరే హీరోని అనుకున్నారట. మరి ఆ హీరో మరెవరో కాదు శ్రీహరి.
ఆ టైంలో శ్రీహరి వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఆయన నో చెప్పారట. అప్పటికే శ్రీహరి నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో త్రిషకు అన్నయ్యగా నటించారు.
మళ్లీ ఈ సినిమాలో నటిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందని కూడా భావించారట. అలా శ్రీహరి నో చెప్పడంతో శీవన్న పాత్ర మోహన్ బాబు వద్దకు వస్తే ఆయన ఓకే చేశాడు. ఆ తర్వాత సినిమా విడుదలై ప్రభాస్, మోహన్బాబు ఇద్దరికి మంచి పేరు తీసుకువచ్చింది.