చిత్ర పరిశ్రమకు చాలామంది హీరోయిన్లు వస్తుంటారు వారిలో కొందరు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి క్రేజ్ ను తెచ్చుకుంటారు. ఇక మన తెలుగులో కూడా చాలామంది హీరోయిన్లు పరిచయమయ్యారు. అలా వచ్చిన వారిలో చాలామంది హీరోయిన్లు ఎక్కువ కాలం రాణించలేకపోయారు. అయితే వారు చేసిన తక్కువ సినిమాలు అయిన మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. మరి కొంతమంది సినిమాలు తగ్గిపోయాక సీరియల్స్ కు షిఫ్ట్ అయ్యారు.
మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ విషయం ఎలా ఉంచితే పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ను గుర్తుపట్టారా.. కమలహాసన్ హీరోగా వచ్చిన శుభసంకల్పంపం సినిమాలో ఈమె నటించింది. అప్పట్లో యువతను తన అందంతో కట్టిపడేసింది. ఈమె పేరు ప్రియా రామన్. కోలీవుడ్లో లోని వల్లి అనే సినిమాలో ఎంట్రీ ఇచ్చింది ప్రియా రామన్.
తెలుగులో కూడా మా ఊరి మారాజు అనే సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక ఆ తర్వాత నాయకుడు, శుభసంకల్పం అనే వరుస సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత దొరబాబు, బాలకృష్ణ నటించిన శ్రీకృష్ణార్జున విజయం సినిమాలలో కూడా నటించి.. తర్వాత చాలాకాలం చిత్ర పరిశ్రమకు దూరమైంది. మళ్లీ శర్వానంద్ హీరోగా వచ్చిన పడి పడి లేచే మనసు సినిమాలో హీరోకి తల్లిగా కనిపించింది.
ప్రియా రామన్ తాజా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్ గా మారాయి. ఆమె కెరీర్ బిగినింగ్ లో ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉన్నారు. అదే అందం మైంటైన్ చేస్తూ నేటి హీరోయిన్లకు కూడా పోటీ ఇస్తుంది. శం పుడుచు అనే సినిమా షూటింగ్ సమయంలో తమిళనాడు రంజిత్ ని ప్రేమించి 1999లో పెళ్లి చేసుకుంది. ఇక తర్వాత కొన్ని సంవత్సరాలకి మధ్యలో ఈ జంట విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ మళ్ళీ ఈ జంట పెళ్లి చేసుకుని ఇప్పుడు కలిసి ఉంటున్నారు..!!