టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో ముందు వరుసలో ఉంటుంది అందాల భామ అనుష్క. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుస సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ దూసుకుపోయింది. అదే సమయంలో సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సూపర్ స్టార్ గా నిలిచింది.
ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెర్కెక్కించిన బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను మెప్పించింది. ఇక చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అనుష్క బాహుబలి సినిమాల తర్వాత వెండితెరపై సరిగా కనిపించింది లేదు. చాలాకాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నా అనుష్క ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తుంది.
ఇదే సమయంలో అనుష్క గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనుష్కకు అరుదైన వ్యాధి ఉందని.. ఓ వార్త బయటకొచ్చింది ఇక అనుష్క వ్యాధితో బాధపడుతుంది. అందుకే ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉందని అంటున్నారు. ఇక ఎప్పుడు ఈ న్యూస్ బయటకు రావడంతో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే అనుష్కకు ఉన్న వ్యాధి అంతా భయంకరమైనది కాదట.
అనుష్కకు ఉన్న వ్యాధి ఏమిటంటే ఆమె నవ్వితే ఆగకుండా దాదాపు 10 నుంచి 20 నిమిషాల పాటు నవ్వుతారట. ఎంత కంట్రోల్ చేసుకున్నా నవ్వు ఆపుకోలేరట. ఇది నీ కారణంగా సినిమాల షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు కూడా పడిందట ఈ విషయంపై గతంలో చాలా వార్తలు కూడా వచ్చాయి. ఎప్పుడు ఈ విషయం తెలిసి అనుష్క అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు. ఇక మరి రాబోయే రోజులైనా అనుష్క వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తుందో లేదో చూడాలి..?