నందమూరి కుటుంబానికి ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్వర్ణ యుగం నడుస్తుంది. ఒక పక్క నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. మరోపక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ను పెంచుకొని గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు నందమూరి ఫ్యామిలీకి ఎవరు ఊహించిన విధంగా వరుస విజయాలను వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఇన్ని సంవత్సరాలు తర్వాత ఆ రేంజ్ లో ఫామ్ లో ఉన్నది ఇప్పుడే.. ఇదే ఉపుని కొనసాగిస్తూ ఇద్దరు తమ భవిష్యత్తులో నటించబోయే సినిమాల గురించి కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బాలయ్య డ్రింమ్ ప్రాజెక్ట్ చెంఘీజ్ ఖాన్ బయోపిక్ చేయడమే ఈ సినిమాను నిర్మించాలంటే దాదాపు రూ.1000కోట్లకు పైగా బడ్జెట్ అవుతుంది. బి గోపాల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివతో దేవర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్, హృతిక్ రోషన్ సినిమాలతో బిజీ అవునన్నాడు.
ఈ రెండు సినిమాలే కాకుండా ఎన్టీఆర్ రాజమౌళితో రూ.5000 కోట్ల భారీ బడ్జెట్ తో ఓ భారీ సినిమా చేయబోతున్నాడట. సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్న రాజమౌళి ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ తో ఈ భారీ సినిమా చేయబోతాడని తెలుస్తుంది. ఇలా ఈ ఇద్దరు నందమూరి హీరోలు తమ కెరియర్ లోనే ఎప్పుడు ఊహించని విధంగా భారీ సినిమాలతో టాలీవుడ్ లోనే దూసుకుపోతున్నారు